విశాఖ పోర్టుకు ఈ ఏడాది మార్చిలో 25 వేల కిలోల మాదకద్రవ్యాలతో వచ్చిన కంటైనర్ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం ఆపరేషన్ గరుడ పేరుతో ఈ మాదకద్రవ్యాలు తీసుకువచ్చిందంటూ తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలను చేశారని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని బొత్స డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖ పోర్టుకు ఈ ఏడాది మార్చిలో 25 వేల కిలోల మాదకద్రవ్యాలతో వచ్చిన కంటైనర్ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం ఆపరేషన్ గరుడ పేరుతో ఈ మాదకద్రవ్యాలు తీసుకువచ్చిందంటూ తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలను చేశారని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని బొత్స డిమాండ్ చేశారు. డ్రగ్స్ కంటైనర్ గురించి పార్లమెంటులో ఉత్తరాంధ్రకు చెందిన కూటమి ఎంపీలు ప్రశ్నించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విచారణను బహిర్గతం చేయాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరాలన్నారు. విశాఖలో జరిగిన భూ ఆక్రమణలపైనా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు. దసపల్లా భూములపై అప్పటి టిడిపి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, సిట్ విచారణలో ఎవరేమి చేశారో తెలుస్తుందన్నారు. ఈ అడ్డగోలు భూ వ్యవహారాల్లో అధికారులు, నాయకులు ఉంటే వారంతా బయటకు వస్తారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో తాము సిట్ నివేదిక బయటపెట్టే ప్రయత్నం చేశామని, కానీ కుదరలేదన్నారు.
రాజకీయాలకతీతంగా ఈ డ్రగ్స్ కంటైనర్ విషయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆ కంటైనర్ లో వచ్చింది డ్రగ్స్ కాకుంటే దెబ్బతిన్న విశాఖ బ్రాండ్ ప్రతిష్ట మళ్ళీ పెరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రతిష్ట కోసమే తాను నిష్పక్షపాత విచారణ కోరుకున్నట్లు స్పష్టం చేశారు. అప్పట్లో ఎన్నికల కోడ్, సిబిఐ విచారణ కారణంగా తమ ప్రభుత్వం జోక్యం చేసుకోలేక పోయిందని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతలు విశాఖ ఫైల్స్ పేరుతో ఏవో అక్రమాలు బయటపెడతామంటూ చెబుతున్నారని, వాటిని వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, 2014 నుంచి 2019 మధ్య కాలంలో విశాఖలో జరిగిన భూ అక్రమాలు, ఆరోపణలపైనా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ప్రతి వ్యవహారాన్ని వైసిపి నాయకులకు అంటగడుతూ ఆరోపణలు చేయడం వలన ప్రజలకు లబ్ధి చేకూరదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కూడా సిట్ బయట పెట్టమని కొన్నిసార్లు కోరానని అయినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. సిట్ ఓపెన్ చేస్తే దస్పల్ల, ఎన్సిసి, రేడియంట్ లాంటి భూ వ్యూహారాలతో సంబంధాలున్న వ్యక్తులందరూ బయటకు వస్తారని బొత్స స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బొత్స సమాధానాలు ఇచ్చారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలం దన్నానపేటలో మాజీ ఇండియన్ ఆర్మీ అధికారి ఇంటిని కూల్చివేయడం దారుణమన్నారు. విజయనగరం జిల్లాలో ఈ తరహా వ్యవహారాలు గతంలో ఎప్పుడూ జరగలేదని, తొలిసారి ఇటువంటి వాటికి అక్కడ నాయకులు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ తరహా రాజకీయాలకు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా బొత్స కోరారు.