మహిళలు మెనోపాజ్ సమయంలో శరీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఒత్తిడికి గురవుతూంటారు. వేడి, అలజడి, నీరసం, ఒళ్లు నొప్పులు, మతిమరుపు వంటి సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సమస్యల నుండి నివారణకు కొన్ని ఆహార మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
మహిళలు మెనోపాజ్ సమయంలో శరీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఒత్తిడికి గురవుతూంటారు. వేడి, అలజడి, నీరసం, ఒళ్లు నొప్పులు, మతిమరుపు వంటి సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సమస్యల నుండి నివారణకు కొన్ని ఆహార మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో తెలుపుకుందాం.. పసుపు ప్రతి భారతీయ వంటకంలో ముఖ్యమైన పదార్థం. ఇది యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండడంతో శరీరంలో జ్వరం, వాపులను తగ్గిస్తుంది. పసుపు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెనోపాజ్ సమయంలో ఎదురయ్యే వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.
అదేవిధంగా ఈ సమయంలో గ్రీన్ టీ శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. ఇది కేవలం క్యాన్సర్ నుండి రక్షించడమే కాకుండా శారీరక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహయపడుతుంది. మెనోపాజ్ సమయంలో గ్రీన్ టీ తరచుగా తీసుకోవడం మంచిది అని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.
మెనోపాజ్ సమయంలో హీట్రోజన్ హర్మోన్లు తగ్గడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. అందుకే కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు చీస్, సోయా, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆహారాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర వహిస్తాయి. అదనంగా బ్రకోలి, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు వేడిని తగ్గించడంలో సహయపడుతాయి.
మెనోపాజ్ సయమంలో ఐరన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఐరన్ అధకంగా ఉండే గుడ్లు, పప్పుధాన్యాలు, చికెన్, నట్స్ వంటి ఆహారపు పదార్థాలని డైట్లో చేర్చుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కారం ఎక్కువగా ఉండే ఆహారం, చక్కెర, పిండి పదార్థాలు, ఉప్పు మితంగా తీసుకోవడం అవసరం. రోజు ఎక్కువగా నీరు తాగడం మంచిది. వ్యాయామం చేయడం కూడా మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ పద్ధతులను పాటించడం వల్ల మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.