రోగాలను మాయం చేసే రాగులు.. రోజూ తీసుకుంటే లాభాలు ఎన్నో.!

తృణధాన్యాల్లో ఒకటైన రాగులను రోజువారి ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంది. పేదవాడి ఆహారంగా చెప్పే రాగులు ఆహారంలో ఉంటే రోగాల బారిన పడకుండా ఉండవచ్చు అన్నది నిపుణుల మాట. వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. రాగుల్లో కాల్షియం, ఐరన్ తోపాటు బోలెడన్ని పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతోపాటు కొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

Rags

రాగులు

తృణధాన్యాల్లో ఒకటైన రాగులను రోజువారి ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంది. పేదవాడి ఆహారంగా చెప్పే రాగులు ఆహారంలో ఉంటే రోగాల బారిన పడకుండా ఉండవచ్చు అన్నది నిపుణుల మాట. వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. రాగుల్లో కాల్షియం, ఐరన్ తోపాటు బోలెడన్ని పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతోపాటు కొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే వారికి ఉపకారిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం వంటి ముఖ్య ఖనిజాలు ఆరోగ్యంగా ఉండడంలో దోహదం చేస్తాయి. రాగుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అసంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

జీర్ణవ్యవస్థలో మెరుగుపరిచే గుణం రాగులకు ఉందని నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అదే సమయంలో అతిగా తినకుండా కూడా రాగులు ఆపుతాయి. ఎక్కువ సమయంపాటు కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల ఇతర ఆహార పదార్థాల తినాలని కోరిక తగ్గుతుంది. తద్వారా బరువు కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫిట్నెస్ ప్రియులు, ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు సాధ్యపడుతుంది. రాగి పిండిలో పుష్కలంగా లభించే మెగ్నీషియం, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండడంలో రాగులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. రాగులు శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రాగులను తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. రాగుల్లోని ఫైబర్ జీర్ణ కేకు సహాయపడుతుంది. దీంతోపాటు అరుగుదల సమస్యను నివారిస్తుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణకోశ సమస్యలను నయం చేయడంలో రాగులు కీలక పాత్ర పోషిస్తాయని పోషకాహారాన్ని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కోరుకునేవాళ్లు రాగులతో కూడిన ఆహార పదార్థాల వైపు మొగ్గుచూపడం శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్