పౌష్ఠికాహారం అందక చాలా మంది రక్త హీనత సమస్యను ఎదుర్కొంటుంటారు. అన్నిరకాల ఆహార పదార్థాలను సమపాళ్లలో తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.
ప్రతీకాత్మక చిత్రం
పౌష్ఠికాహారం అందక చాలా మంది రక్త హీనత సమస్యను ఎదుర్కొంటుంటారు. అన్నిరకాల ఆహార పదార్థాలను సమపాళ్లలో తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. నీరసం, కాళ్లు లాగడం, ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం జరుగుతుంటాయి. ఈ రక్తహీనతను తగ్గించి.. రక్తాన్ని పెంచే ఆహార పదార్థాలు ఏవి? అనే విషయం తెలుసుకోవడం కూడా ముఖ్యం.
మన దేశంలో 57 శాతం మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నారు. ఇది మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా అంటే.. వాళ్లకి ప్రతినెల నెలసరి సమయంలో బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి. మరికొందరిలో ఇది ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. ఎక్కువ ఐరన్ ఉండే ఫుడ్ తీసుకోకపోవడం కుడా కారణం. కడుపులో నులి పురుగులు ఉన్నా రక్తహీనతకు దారితీస్తుంది. అందుకే రక్తహీనతను తగ్గించుకొవడానికి ఐరన్ రిచ్ ఫుడ్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే..