రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా.. అయితే ఈ ఇబ్బందులు తప్పవు.!

మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో అనేక అనారోగ్య సమస్యలను ప్రజలు కొని తెచ్చుకుంటున్నారు. వేలా పాలాలేని సమయాల్లో ఆహారం తీసుకుంటూ అనారోగ్యాలకు స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా ఆహారం తీసుకునేవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. డిన్నర్ లేటుగా చేసేవారిలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో అనేక అనారోగ్య సమస్యలను ప్రజలు కొని తెచ్చుకుంటున్నారు. వేలా పాలాలేని సమయాల్లో ఆహారం తీసుకుంటూ అనారోగ్యాలకు స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా ఆహారం తీసుకునేవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. డిన్నర్ లేటుగా చేసేవారిలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేగంగా డిన్నర్ పూర్తి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఆలస్యంగా డిన్నర్ చేస్తే ఇవి ఇబ్బందులు..

లేట్ నైట్ డిన్నర్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేయవచ్చు. కడుపు ఉబ్బరం, యాసిడ్ రిప్లెక్స్ అలాంటి సమస్యలు పెరుగుతాయి. మలబద్ధకం సమస్య పెరుగుతుంది. రాత్రిళ్ళు ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు కచ్చితంగా వేగంగా డిన్నర్ పూర్తి చేయాలి. లేకపోతే మెటబాలిజం తగ్గిపోతుంది. దీనివల్ల బరువు తగ్గడం కష్టం అవుతుంది. లేట్ నైట్ డిన్నర్ వల్ల నిద్ర సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. ఇన్సోమియా సమస్య ఇబ్బందులకు గురి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, ఫటిగో వంటి సమస్యలు వేధిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

డిన్నర్ వేగంగా చేయడం వల్ల మేలు..

డిన్నర్ సూర్యాస్తమయం లోపు పూర్తిచేస్తే చాలా మంచిది. కానీ, ఇది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి కనీసం 8 గంటలలోపు అయిన డిన్నర్ ముగించేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రకు రెండు గంటల ముందు డిన్నర్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వేగంగా డిన్నర్ పూర్తి చేయడం వల్ల జీర్ణ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. తిన్నది అరగకపోవడం, యాసిడ్ రిఫ్లెక్షన్స్ వంటి సమస్యలు ఉండవు. రాత్రి 8 గంటలలోపు డిన్నర్ చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. జీవక్రియ మెరుగు కావడం వల్ల బరువు తగ్గుతారు. పోషకాలు శరీరానికి అందుతాయి. మధుమేహం ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. రెసిస్టెన్స్ పెరుగుతుంది. మెరుగైన నిద్ర సొంతమవుతుంది. నిద్రలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి. జీర్ణ సమస్యలు నిద్రను డిస్టర్బ్ చేయవు. బరువు తగ్గడానికి ఎర్లీ డిన్నర్ హెల్ప్ చేస్తుంది. గుండె సమస్యలను దూరం చేస్తుంది. ఒత్తిడి తగ్గి పనిపై ఫోకస్ పెరుగుతుంది. మానసికంగానూ దృఢంగా ఉండటంలో ఎర్లీ డిన్నర్ దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు పెద్దలకే కాకుండా చిన్న పిల్లలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రై చేసిన, డీప్ ఫ్రై ఫుడ్ జోలికి వెళ్ళకూడదని నిపుణులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్