బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కీలక ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం.!

ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృత్యువాత చెందుతున్నాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా అధికారులను అలెర్ట్ చేసింది. ప్రత్యేక జోన్లుగా విభజించి బర్డ్ ఫ్లో వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలకు పూనుకుంది. ముఖ్యంగా మాంసం, గుడ్లు విక్రయాలపై కొన్ని నిబంధనలను ఆ ప్రాంతాల్లో విధించింది. ఈ రెండు జిల్లాల్లో వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూ వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి అచ్చం నాయుడు స్వయంగా ప్రకటించారు.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృత్యువాత చెందుతున్నాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా అధికారులను అలెర్ట్ చేసింది. ప్రత్యేక జోన్లుగా విభజించి బర్డ్ ఫ్లో వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలకు పూనుకుంది. ముఖ్యంగా మాంసం, గుడ్లు విక్రయాలపై కొన్ని నిబంధనలను ఆ ప్రాంతాల్లో విధించింది. ఈ రెండు జిల్లాల్లో వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూ వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి అచ్చం నాయుడు స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతూ ఉండడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీ తోపాటు భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. కేంద్రం నుంచి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయి.. కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రెటరీ కూడా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. 

చికెన్ తినవచ్చు.. భయం వద్దు..

బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న వార్తలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చికెన్ విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం పేర్కొంది. బాగా ఉడికించిన గుడ్లను, మాంసాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంలో పలు మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలు, సమాచారం వల్ల ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రజలు భయాందోళనలకు గురయ్యేలా బర్డ్ ఫ్లూ పై తప్పుడు వార్తలు, సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చం నాయుడు హెచ్చరించారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను బయో సెక్యూరిటీ జోన్లుగా ప్రభుత్వం విభజించింది. ఏలూరు జిల్లా బాదంపూడి, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు, కానూరు, కృష్ణాజిల్లా గంపలగూడెం ప్రాంతాల్లోని ఐదు పౌల్ట్రీ లో ఈ వ్యాధి సోకునట్లు గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాలను బయో సెక్యూరిటీ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు అధికారులను, సిబ్బందిని పంపించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలను చేపట్టారు. బర్డ్ ఫ్లూ వ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాలు ప్రకారం వ్యాధి సేకరణ ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో రాకపోకలను, దాన రవాణాను నియంత్రిస్తున్నామని, ఒక్క పౌల్ట్రీ కూడా లేకుండా చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఒకటి నుంచి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ముందస్తు జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే బయటపడిన ప్రాంతాల్లో తప్ప మరి ఎక్కడ ఈ వ్యాధి సోకిన దాఖలాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు 14 వేల కోళ్లను కాల్చేశామని, మరో మూడు పౌల్ట్రీలో 1.40 లక్షల వరకు కోళ్లు ఉన్నాయని, వాటిని కూడా కాల్చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్