నేడు విజయవాడకు వైఎస్ జగన్.. వల్లభనేని వంశీతో ములాఖత్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడకు రానున్నారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ కొద్దిరోజుల కిందట అరెస్టు అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రావు పరామర్శించనున్నారు. గాంధీనగర్లోని జిల్లా జైల్లో ఉన్న వంశీని జగన్మోహన్ రెడ్డి మూలాఖత్ లో కలిసి పరామర్శించనున్నారు. ఉదయం 10:30 ప్రాంతంలో జగన్ వంశీని కలుస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

YS jagan, vallabhaneni Vamsi

వైఎస్ జగన్, వంశీ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడకు రానున్నారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ కొద్దిరోజుల కిందట అరెస్టు అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రావు పరామర్శించనున్నారు. గాంధీనగర్లోని జిల్లా జైల్లో ఉన్న వంశీని జగన్మోహన్ రెడ్డి మూలాఖత్ లో కలిసి పరామర్శించనున్నారు. ఉదయం 10:30 ప్రాంతంలో జగన్ వంశీని కలుస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడితోపాటు మరికొన్ని కేసుల్లో వంశీని పోలీసులు నాలుగు రోజుల కిందట అరెస్టు చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టిన పోలీసులకు కోర్టు జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు విజయవాడకు రానున్నారు. వంశీని కలిసి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసాను ఇవ్వడంతోపాటు న్యాయపరంగానూ పోరాటాన్ని సాగించేందుకు సహకరిస్తామని హామీ ఇవ్వనున్నారు. ఇప్పటికే వాళ్లని వంశీని కలిసిన ఆయన భార్య కూడా పార్టీ పరంగా తమకు అండగా ఉన్నారని చెబుతూ వచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు చెందిన ముఖ్య నాయకులు ఆయన ఉండనున్నారు. 

మరిన్ని అరెస్టుల హెచ్చరికలతో వైసిపి అప్రమత్తం 

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన ఎంతోమంది ముఖ్య నేతలు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కొద్దిరోజుల కిందట మాజీ ఎంపీ నందిగామ సురేష్ జైలుకు వెళ్లి బయటికి వచ్చారు. తాజాగా వల్లభనేని వంశీ జైలుకు వెళ్లారు. జోగి రమేష్ కుమారుడు కూడా జైలుకు వెళ్లారు. మాజీ మంత్రి పేర్న నాని భార్యపైన కేసులో నమోదు చేశారు. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత మరికొందరు అవుతారని టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ జాబితాలో కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్ వంటి నేతలు ఉన్నారని చెబుతున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో వైసిపి అప్రమత్తమయింది. తమ నేతలను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ ల పొందడంతో పాటు ఒకవేళ అరెస్టు చేసిన వెంటనే బెయిల్ లభించేలా చర్యలను వైసీపీ లీగల్ టీమ్ చేపడుతోంది. ఇప్పటికే వైసీపీ లీగల్ టీమ్ వల్లభనేని వంశీ బెయిల్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి మూలాఖత్ తర్వాత వంశీకి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వంశి అయితే స్ట్రాంగ్ గానే ఉన్నారన్న విషయం తెలుస్తుంది. పోలీస్ కస్టడీకి కొద్దిరోజుల్లోనే తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్