రైతులపై ఏపీ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని వైఎస్ఆర్సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని కనీసం కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జగన్ ఆరోపించారు. ఈతరణంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఇన్సూరెన్స్, ఎయిర్పోర్ట్ సబ్సిడీ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. అకాల వర్షాలు వల్ల పంటలు నష్టపోయిన కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను ఆయన పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
రైతులపై ఏపీ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని వైఎస్ఆర్సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని కనీసం కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జగన్ ఆరోపించారు. ఈ తరణంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఇన్సూరెన్స్, ఎయిర్పోర్ట్ సబ్సిడీ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. అకాల వర్షాలు వల్ల పంటలు నష్టపోయిన కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను ఆయన పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారికి భరోసాను జగన్ కల్పించారు. రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు జగన్. అనంతరం మీడియాతో మాట్లాడి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో రైతుల ఉన్నారని, ఇటువంటి తరుణంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేసారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు రుణ వడ్డీ రుణాలు కూడా అందడం లేదని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాను నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చానని పేర్కొన్నారు. అకాల వర్షాలు కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులపై ఓటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. వర్షాలు, గాలులతో వంట నష్టం తీవ్రంగా ఏర్పడిందన్నారు. నేల కిందట 26000 ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో ఉచిత పంటల భీమా రైతులకు హక్కుగా ఉండేదని, తన ప్రభుత్వ హయాంలో రైతులకు న్యాయం చేసామన్నారు. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నెంబర్ వన్ స్థానంలో ఉందని, తన ప్రభుత్వ హయాంలో 25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేశామన్నారు. కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీలు కూడా వాడుకోలేకపోతున్నారని ఆరోపించారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ప్రతి రైతు కలలో ఆనందం కనిపించేలా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్, సబ్సిడీ ఇస్తామని జగన్ రైతులకు హామీ ఇచ్చారు.