ప్రభుత్వానికి మండలిలో చుక్కలు చూపిస్తున్న వైసీపీ.. ఇక్కడే తాడోపేడో.!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది. అసెంబ్లీలో ఆశించిన స్థాయిలో బలం లేకపోవడంతో గళం విప్పే అవకాశం ఆ పార్టీకి లేకుండా పోయింది. దీంతో బలం ఉన్న శాసన మండలిలోనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసిపి భావించింది. ప్రజా సమస్య ఏదైనా మండలిలో ప్రభుత్వాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్సీ ఒక్కో ప్రభుత్వ వైఫల్యం మీద మాట్లాడేలా వారికి బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలోనే మండలిలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ చుక్కలు చూపిస్తున్నారు.

 legislative council

శాసన మండలి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది. అసెంబ్లీలో ఆశించిన స్థాయిలో బలం లేకపోవడంతో గళం విప్పే అవకాశం ఆ పార్టీకి లేకుండా పోయింది. దీంతో బలం ఉన్న శాసన మండలిలోనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసిపి భావించింది. ప్రజా సమస్య ఏదైనా మండలిలో ప్రభుత్వాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్సీ ఒక్కో ప్రభుత్వ వైఫల్యం మీద మాట్లాడేలా వారికి బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలోనే మండలిలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మంచి ప్రభుత్వం అంటూ ప్రచారం సాగిస్తున్న ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఎలా మంచిదో చెప్పాలంటూ ప్రభుత్వ వైఫల్యాలను మండలి వేదికగా ప్రశ్నించారు. ఆ తరువాత ఇదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ వీసీల రాజీనామా సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులు చేసిన హంగామాను లేవనెత్తి మంత్రి లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ రూటు మార్చిందా అన్నట్టుగా కనిపిస్తోంది.

బలం లేని చోట మాట్లాడిన ప్రయోజనం ఉండదని.. బలం ఉన్నచోట ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ద్వారా ప్రజా పక్షాన ఉండి పోరాటం సాగించే అవకాశం ఉందని వైసిపి భావిస్తోంది. అందుకు అనుగుణంగానే అధికార పక్షాన్ని శాసనమండలిలో చెడుగుడు ఆడేసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. శాసన మండలిలో ఇప్పటికీ వైసీపీకే బలం ఉండడంతో ఆ పార్టీ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తోంది. కూటమి నాయకులు గతంలో ఇచ్చిన హామీలపై బలంగా ప్రశ్నిస్తూ ప్రజల్లోకి ఆ వైఫల్యాలను తీసుకువెళ్తోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకూడదు అన్నట్టుగా మండలిలోని ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మండలిలోని వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తమకు వచ్చిన అవకాశాన్ని బలంగానే సద్వినియోగం చేసుకోవాలన్న భావన ఆ పార్టీ ఎమ్మెల్సీలు కనిపిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు గవర్నర్తో చెప్పించిన విషయంపై ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో స్పందించారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు సభ వేదికగా ప్రశ్నించడంతో.. మంత్రి లోకేష్ స్పందిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పామని, కల్పించినట్లు చెప్పలేదంటూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ సీనియర్ నేత కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు కూడా బలంగా ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. బొత్స సత్యనారాయణ కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనులు నిమగ్నమయ్యారు. రానున్న రోజుల్లో కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తూ వైసిపి వాయిస్ ను మండలిలో వినిపించడం ద్వారా ప్రజా సమస్యలను లేవనెత్తాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీలకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్లకపోయినా మండలిలో యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని, కీలక అంశాలపై మీడియా సమావేశాల ద్వారా పార్టీ అధినేత జగన్ స్పందించాలని డిసైడ్ అయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో మూడు వారాలపాటు సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో మండలిలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే దిశగా వైసిపి వ్యూహరచన చేస్తోంది. ఒక్కో ఎమ్మెల్సీ ఒక్కో అంశంపై మాట్లాడి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్