గత ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి నాయకులు వాటిని అమలు చేయడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని ఆయన పార్టీ నాయకులు, కేడర్కు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆయన మూడు తేదీలను ఫిక్స్ చేసి ప్రజల తరఫున అధికారులకు వినతిపత్రాలను అందించాలని సూచించారు. వ్యవసాయం చేసేందుకు ఎన్నికలకు ముందు రైతులకు ఆర్థికంగా సహాయాన్ని అందిస్తామని కూటమి నాయకులు పేర్కొన్నారు.
వైసీపీ, జగన్
ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లోకి వెళ్లే పోరాటం చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్ ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లో కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులకు గురైన వారిని పరామర్శిస్తూ వారికి అండగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గత ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి నాయకులు వాటిని అమలు చేయడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని ఆయన పార్టీ నాయకులు, కేడర్కు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆయన మూడు తేదీలను ఫిక్స్ చేసి ప్రజల తరఫున అధికారులకు వినతిపత్రాలను అందించాలని సూచించారు. వ్యవసాయం చేసేందుకు ఎన్నికలకు ముందు రైతులకు ఆర్థికంగా సహాయాన్ని అందిస్తామని కూటమి నాయకులు పేర్కొన్నారు. ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. కూటమి నాయకులు ఇప్పటి వరకు రైతులకు రూపాయి కూడా విడుదల చేయలేదు. పెట్టుబడి సాయం విడుదల చేయాలని, ఉచిత పంటలు భీమా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 11న జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి నిరసన తెలియజేయనున్నారు.
అనంతరం రైతులతో కలిసి పార్టీ నాయకులు కలెక్టర్లను కలిసి వినతిపత్రాలను ఈ మేరకు సమర్పించనున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలను భారీగా పెంచి బాదుడే బాదుడు అంటూ ప్రజలపై భారం మోపిన నేపథ్యంలో ఈ నెల 27న విద్యుత్శాఖ ఎస్ఈ కార్యాలయాలు వద్ద వైసీపీ నాయకులు ప్రజలతో కలిసి నిరసన తెలియజేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విద్యుత్ చార్జీలను పెంచమంటూ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే చార్జీలను పెంచిన తీరును నిరసిస్తూ ఆయా కార్యాలయాలు వద్ద ఆందోళన చేపట్టనున్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. అలాగే, గత విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు రూపాయి కూడా ఫీజులను చెల్లించలేదని వైసీపీ విమర్శిస్తోంది. అలాగే, గతంలో పెండింగ్లో ఉన్న విద్యా, వసతి దీవెన బిల్లులను క్లియర్ చేయలేదంటూ ఆరోపిస్తుంది. మొత్తంగా నాలుగు క్వార్టర్లకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని విడుదల చేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి జనవరి మూడో తేదీన ఆందోళన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కార్యాలయాలు వద్ద నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ నాయకులు, విద్యార్థులతో కలిసి ఫీజులు బిల్లులు విడుదల చేయాలంటూ కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పించనున్నారు.