నేడు, రేపు పార్టీ నేతలతో సమావేశం కానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం, గురువారం ఆ పార్టీకి చెందిన నాయకులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం వివిధ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఉన్న నాయకులు కూడా సమావేశానికి హాజరుకానున్నారు.

YS Jagan Mohan Reddy

 వైయస్ జగన్మోహన్ రెడ్డి 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం, గురువారం ఆ పార్టీకి చెందిన నాయకులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం వివిధ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఉన్న నాయకులు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలపై పార్టీ నాయకులతో చర్చించనున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో హామీలు అమలుపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అదే సమయంలో గతంలో తమ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి చేస్తున్న విమర్శలు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని, అదే సమయంలో క్యాడర్ పై జరుగుతున్న దాడులను నియంత్రించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జగన్ నేతలకు సూచించనున్నారు. అదే సమయంలో భవిష్యత్తు ప్రణాళికను ముఖ్య నేతలకు వివరించనన్నారు. తప్పని సరిగా సమావేశానికి హాజరు కావాలంటూ నేతలకు ఎప్పటికీ సమాచారం అందింది. ఈ రెండు రోజులు నాయకులతోనే సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో.. ప్రజలతో కలిసేందుకు అవకాశం ఉండదని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ రెండు రోజులు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు రావద్దంటూ స్పష్టం చేసింది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలని ఆ ప్రయత్నం. 

నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న బొత్స 

స్థానిక సంస్థల శాసన మండల సభ్యులుగా ఎన్నికైన మాజీమంత్రి బొత్స సత్యనారాయణ బోధవారం మధ్యాహ్నం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు చాంబర్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయానికి చేరుకొని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం, క్యాడర్ కు అండగా ఉండడం, నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యవహారపైన ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్