ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాల్లోని సొమ్ము తీసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసేదశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చేసిన సిఫార్సుల మేరకు ఇకపై ఏటీఎంతోపాటు ఫోన్ పే వంటి యూపీఐలు ద్వారా కూడా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మీ చివరివారం నుంచి గాని జూన్ మొదటి వారం నుంచి గాని ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల కార్యదర్శి సుమిత్ర ధావ్రా వెల్లడించారు. తొలిత లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ద్వారా ఖాతాకు బదిలీ చేసుకోవచ్చని వెల్లడించారు. పీఎఫ్ ఖాతాలోని నిల్వను యూపీఐ ద్వారా చూసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాల్లోని సొమ్ము తీసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసేదశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చేసిన సిఫార్సుల మేరకు ఇకపై ఏటీఎంతోపాటు ఫోన్ పే వంటి యూపీఐలు ద్వారా కూడా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మీ చివరివారం నుంచి గాని జూన్ మొదటి వారం నుంచి గాని ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల కార్యదర్శి సుమిత్ర ధావ్రా వెల్లడించారు. తొలిత లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ద్వారా ఖాతాకు బదిలీ చేసుకోవచ్చని వెల్లడించారు. పీఎఫ్ ఖాతాలోని నిల్వను యూపీఐ ద్వారా చూసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇళ్ల నిర్మాణం, విద్య, ఆరోగ్యం, వివాహం వంటి అవసరాల కోసం చాలా సులువుగా సొమ్ము విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. పీఎఫ్ సొమ్ము కోసం దరఖాస్తు చేసిన మూడు రోజుల్లో పీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము విత్ డ్రా చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దాదాపు 95% క్లైమ్ లు ఆటోమేటెడ్ విధానంలో జరుగుతున్నాయి. పెన్షనర్లు కూడా ఏ బ్యాంకు నుంచి అయినా సొమ్ము తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల పిఎఫ్ సొమ్ము విత్ డ్రా చేసుకోవాలనుకునే వారికి మేలు చేకూరుతుంది.
ఇకపై ఆ ఇబ్బందులకు స్వస్తి..
ప్రస్తుతం వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ పిఎఫ్ అమౌంటు తీసుకోవాలంటే కొంత ఇబ్బంది పడాల్సి వస్తోంది. దరఖాస్తు చేసిన కనీసం 10 నుంచి మూడు వారాల వరకు సమయం పడుతుంది. అప్పుడు ఎకౌంట్లో ఈ మొత్తం జమ అవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు తీయాలనుకునే వారికి ఇది ఇబ్బందిగా మారుతుంది. దీనిపై కేంద్ర కార్మిక శాఖకు అనేక వినతులు రావడంతో దీనిపై కీలక నిర్ణయాన్ని కేంద్ర కార్మిక శాఖ తీసుకుంది. ఏటీఎం తరహాలోనే డబ్బులు తీసుకునే వెసులుబాటును కేంద్ర కార్మిక శాఖ పిఎఫ్ వినియోగదారులకు కల్పిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. క్షణాల్లోనే అకౌంట్ నుంచి డబ్బులను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కేంద్ర కార్మిక శాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.