కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు సూటి ప్రశ్న వేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. రాహుల్ గాంధీ గారూ.. మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభమంటూ ప్రశ్నించారు. అదాని - అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం అని నిలదీసిన కేటీఆర్.. దేశ వ్యాప్తంగా భూసేకరణపై రణ గర్జన చేస్తున్న మీరు, తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయారు అంటూ నిలదీశారు.
భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు సూటి ప్రశ్న వేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. రాహుల్ గాంధీ గారూ.. మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభమంటూ ప్రశ్నించారు. అదాని - అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం అని నిలదీసిన కేటీఆర్.. దేశ వ్యాప్తంగా భూసేకరణపై రణ గర్జన చేస్తున్న మీరు, తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయారు అంటూ నిలదీశారు. కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైందంటూ విమర్శించారు. అదాని - అంబానీలపై మీ జంగ్.. రామన్నపేటలో అదాని ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచిందని నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమేనని, మరి ఎందుకు ఇక్కడ అభ్యంతరం చెప్పలేదని కేటీఆర్ ప్రశ్నించారు. 'నేను కొట్టినట్లు చేస్తా. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా' అని కేటీఆర్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా అని ప్రశ్నించిన కేటీఆర్.. రేవంత్ - అదానీలతో వ్యాపార బంధమా.? అని నిలదీశారు. అదాని - అంబానీలపై మీరు సాగిస్తున్న పోరాటం భూటకమని, తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రమంటూ కేటీఆర్ నిలదీశారు.
కాంగ్రెస్ పాలనపై సంతృప్తి చెందిందా.?
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏఐసిసి సంతృప్తి చెందిందా.? అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోకటి ఉంటుందా.? అని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏఐసీసీకి అంత సంతృప్తి ఎందుకో అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా.? ఈ సంతృప్తి అంటూ నిలదీశారు. అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా.? కొడంగల్ లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా ?? ఈ సంతృప్తి అంటూ ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలి పశువులను చేస్తున్నందుకా.? అని ప్రశ్నించిన కేటీఆర్.. మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా.? ప్రభుత్వంపై సంతృప్తి జరిగిందా అంటూ ప్రశ్నించారు. హైడ్రా పేరిట పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకా.? ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా.?, రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా.? తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి, ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా.? రేవంత్ ప్రభుత్వంపై అధిష్టానానికి సంతృప్తి అంటూ నిలదీశారు. సంక్షేమానికి సమాధి కట్టి, అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా.? ఈ సంతృప్తి అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని సకల రంగాలను, సబ్బండ వర్గాలను దగా చేసినందుకా అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణను ఆగం చేసినందుకా.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా, మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని, గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోందని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాతపెడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.