మళ్లీ ఠారెత్తిస్తున్న ఎండలు.. నైరుతి రుతుపవనాలు ఎక్కడిదాకా వచ్చాయంటే..

Weather News | ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఓ వారం పది రోజులు వర్షాలతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు మళ్లీ ఎండల ధాటికి మాడిపోతున్నారు. దానికి తోడు ఉక్కపోత చుక్కలు చూపిస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడు నైరుతి రుతుపవనాలు వస్తాయా?

weather news
ప్రతీకాత్మక చిత్రం

ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఓ వారం పది రోజులు వర్షాలతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు మళ్లీ ఎండల ధాటికి మాడిపోతున్నారు. దానికి తోడు ఉక్కపోత చుక్కలు చూపిస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడు నైరుతి రుతుపవనాలు వస్తాయా? ఎప్పుడు వర్షం పడుతుందా? ఈ ఎండల బారి నుంచి ఎప్పడు బయటపడదామా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి వాతావరణ విభాగం నైరుతి రుతుపవనాలపై అప్ డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని వెల్లడించింది.

రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల మీదుగా ముందుకు సాగుతాయని వాతావరణ శాఖ వివరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంపై ఏర్పడ్ తీవ్ర అల్పపీడనం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతోందని తెలిపింది. ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారి అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్ అనంతరం పశ్చిమ బెంగాల్ తీరాలను దాటుతుందని పేర్కొంది.

మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మళ్లీ సోమవారం నుంచి వాతావరణం పొడిగా మారుతుందని వివరించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్