ఏపీలో మరో కీలక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించి కూటమి సర్కారు శ్రీకారం చుట్టబోతోంది. అందులో భాగంగానే పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు సోమవారం భూమి పూజ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గ్రామ సభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించి 3000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతి మంజూరు చేశారు.
పల్లె పండగ కార్యక్రమంపై అధికారులతో సమీక్షిస్తున్న పవన్ కళ్యాణ్
ఏపీలో మరో కీలక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించి కూటమి సర్కారు శ్రీకారం చుట్టబోతోంది. అందులో భాగంగానే పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు సోమవారం భూమి పూజ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గ్రామ సభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించి 3000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతి మంజూరు చేశారు. సాంకేతిక ఆమోదం కోసం ఇంజనీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరిగే భూమి పూజలో పాల్గొంటారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సిమెంట్ కొనుగోలుకు సంబంధించి ఒక్కో బస్తా రూ.250 చొప్పున స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేసి వాడుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఆమోదించిన క్వారీలు నుంచి సేకరించాలని పేర్కొంది. ప్రతి రోడ్డు పని వద్ద వర్క్ సైట్ బోర్డు ఏర్పాటు చేయాలని, దానిపై ఆయా పనులకు సంబంధించి పూర్తి వివరాలు ఉండాలని సూచించింది. అన్ని పనులకు సంబంధించి పౌర సమాచార బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
నాణ్యతతో కూడిన సిమెంట్ రోడ్లను జనవరిలోపు పూర్తి చేయాలని, వీటిని క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ విభాగం తనిఖీ చేస్తుందని మార్గదర్శకాల్లో వెల్లడించింది. రానున్న సంక్రాంతి నాటికి సిమెంట్ రోడ్లను ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులు సద్వినియోగం ఐదేళ్ల తర్వాత ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాదిలో రూ.3000 కోట్లతో మూడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలో మీటర్ల తారు రోడ్ల నిర్మాణం చేయడంతోపాటు 22 వేల మినీ గోకులాలతోపాటు పలు వ్యక్తిగత ఆస్తులను పేదలకు అందించనున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ఉపాధి పథకం మెటీరియల్ నిధులు విస్తృతంగా వినియోగించుకున్న వారు వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఉపాధి పథకం పూర్తిని దెబ్బతీయడంతోపాటు మెటీరియల్ నిధులను వాడుకోవడంలో విఫలమైందంటూ గతంలో కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఈ ఇబ్బందులను పరిష్కరించే దిశగా కూటమి నేతలు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం రోడ్లను పూర్తిగా విస్మరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఏకంగా కొన్ని రోడ్లు మాయమయ్యాయి. గతంలో వేసిన తారు రోడ్ల నిర్వహణకు నోచుకోకపోవడంతో వాటిపై కంకర, తారు క్రమంగా కనుమరుగయింది. ఆ రోడ్లపై వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో బస్ సర్వీసులు నిలిపేశారు. ఇప్పుడు నడక దారిగా ఉన్న రోడ్లను అప్పటి టిడిపి సర్కార్ తారు రోడ్లుగా మారిస్తే వైసిపి పాలనలో అవి మళ్ళీ నరకదారులుగా మారిపోయాయి. పంచాయతీరాజ్ రోడ్లు మీద కనీసం మట్టి పోసి మరమ్మతులు చేసిన దాఖలాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధ్వానంగా ఉన్న ఆయా రోడ్లను మార్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. నూతన రోడ్ల నిర్మాణంతోపాటు పాడైన రోడ్లను మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.