ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఏటా కోట్ల మంది భక్తులు వస్తుంటారు. నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు సంఖ్య తక్కువేమీ కాదు. తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కొంత ఇబ్బందికరంగా భక్తులకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఏటా కోట్ల మంది భక్తులు వస్తుంటారు. నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు సంఖ్య తక్కువేమీ కాదు. తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కొంత ఇబ్బందికరంగా భక్తులకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే దేశంలోని ప్రధాన నగరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తున్నారు. తాజాగా నిర్వహించిన టిటిడి పాలకమండలి సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది దేశంలోనే అనేకచోట్ల వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించడం. దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో వెంకటేశ్వర ఆలయాలు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఎక్కడెక్కడ ఆలయాలు నిర్మించాలి అనే దానిపై అధికారులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని భక్తులు స్వామివారిని ఎప్పటికప్పుడు దర్శించుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇది ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతోపాటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోరికను నెరవేర్చినట్టు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో స్వామివారి ఆలయాలను నిర్మించేందుకు త్వరితగతన చర్యలు చేపట్టనున్నారు. అందుకు అనుగుణంగా సమావేశంలో తీర్మానాన్ని చేశారు.
టిటిడి పాలకమండలి మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది. ఈ మేరకు కొన్ని తీర్మానాలు చేశారు. వీటిలో తిరుపతి, స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు. దీని వల్ల కేంద్రం నుంచి అదనపు నిధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోపు దర్శనంపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలోని హోటల్ ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలకు ఆమోదం తెలిపారు. ఆక్రమణల అంశంలో తిరుమలలో ఒక మఠానికి ఇప్పటికే షోకాజు నోటీసులు జారీ చేశారు.
నడక మార్గంలో గుండెపోటు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో తిరుమల అశ్విని ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలకు, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కంచి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సాంప్రదాయ పాఠశాలలకు ఎస్వీ విద్యాదానం ట్రస్టు ద్వారా రెండు కోట్లు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఆహార పదార్థాల తనిఖీ కోసం టీటీడీలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేయనున్నారు. సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను కార్పొరేషన్ ద్వారా భర్తీకి ఆమోదించారు. అన్న ప్రసాద కేంద్రంలో నాణ్యమైన అన్న ప్రసాదాలు అందించేందుకు కార్పొరేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు నిర్ణయించారు. ఆల్వార్ ట్యాంకు విశ్రాంతిభవనం నుంచి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలోనే సర్వ దర్శన క్యూ లైన్ లో రూ.3.36 కోట్లతో ఆరు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఒంటిమిట్ట రామాలయంలో విమాన గోపురానికి బంగారు కలశం ఏర్పాటుకు 43 లక్షల రూపాయల కేటాయించారు. నవీ ముంబైలో పద్మావతి అమ్మవారి ఆలయానికి సీడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన రూ.20 కోట్లకుపైగా ఉన్న లీజు ధర తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని పాలక మండల సమావేశంలో తీర్మానించారు.