విదేశాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలు.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ వెంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 2025-26 ఏడాదికి వార్షిక బడ్జెట్‌ను రూ.5258.68 కోట్లతో పాలక మండలి ఆమోదం తెలిపింది. ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణానికి వేరేచోట భూమి కేటాయించాలని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు సూచించడంతో అలిపిరి వద్ద ఉన్న 35.24 ఎకరాలతోపాటు 15 ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకుని ప్రత్నామ్నాయంగా 50 ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ వెంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 2025-26 ఏడాదికి వార్షిక బడ్జెట్‌ను రూ.5258.68 కోట్లతో పాలక మండలి ఆమోదం తెలిపింది. ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణానికి వేరేచోట భూమి కేటాయించాలని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు సూచించడంతో అలిపిరి వద్ద ఉన్న 35.24 ఎకరాలతోపాటు 15 ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకుని ప్రత్నామ్నాయంగా 50 ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం స్వామి వారిఆలయాలు నిర్మిస్తున్నారు. విదేశాల్లో కూడా స్వామి వారి ఆలయాలను నిర్మించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టుతోపాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే మరో ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో ఈ ఆలయాలను నిర్మించనున్నారు.

శ్రీవారి ఆస్తులకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నారు. ఇప్పటికే పలువురు సీఎంలు ఆలయాల నిర్మాణాలకు ఆమోదం తెలిపిన విషయాన్ని పాలక మండలి గుర్తు చేసింది. ఏపీలో పలు చోట్ల నిలిచిపోయిన దేవాలయాలను పునర్నిర్మించాలని సమావేశంలో నిర్ణయించినట్టు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. పోటు కార్మికులకు జీఎస్టీ భారం లేకఉండా జీతం రూ.43 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. సైన్స్‌ సిటీకి టీటీడీ కేటాయించిన 20 ఎకరాల స్థలాలను రద్దు చేయాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. లైసెన్స్‌ లేని హ్యాకర్ల నిర్మూలనకు రెవెన్యూ, విజిలెన్స్‌ శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగుల నేమ్‌ బ్యాడ్జ్‌లు ఏర్పాటుపై అధ్యయం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు గతంలో మాదిరిగా ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు. తిరుపతి గంగమ్మ, తలకోన, కర్నూల్‌ జిల్లాలో బుగ్గ, అనకాపల్లి జిల్లాలోని ఉపమాత, ధర్మవరం, తెలంగాణలోని కొడంగల్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌లోని నూతనంగా ఆలయాలు నిర్మిస్తున్నామని ప్రకటించారు. 180 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు జీతభత్యాలు పెంపుపై కమిటీ వేశామని, వికలాంగులు, వృద్ధులకు ఆఫ్‌లైన్‌లో టికెట్స్‌ జారీపై కమిటీ వేసినట్టు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. గూగుల్‌ సంస్థ ద్వారా తిరుమల కార్యకలాపాల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ వినియోగిస్తున్నట్టు చైర్మన్‌ తెలిపారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్