సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు 200 రూపాయలు తీసుకొని వెళ్తే సంచినిండా కూరగాయలు వచ్చేవి. కానీ, ఇప్పుడు రెండు రకాల కూరగాయలు కూడా రావడం లేదు. గత వారం వరకు కార్తీకమాసం వారాలు కాబట్టి ధరలు భారీగా పడిపోయాయి. అదేవిధంగా చికెన్ ధరలు కూడా తగ్గాయి. దీనితో కూరగాయల ధరలకు ప్రస్తుతం రెక్కలు వచ్చాయి పంట దిగుబడి కూడా తక్కువగా ఉండడం పంట సరిగా చేతికి అందకపోవడంతో ధరలు పెరిగాయి. ఒక్కొక్క కూరగాయ ధర చూసుకున్నట్లయితే బీన్స్ 50 రూపాయలు చెక్కులు 65 రూపాయలు దొండకాయ 50 రూపాయలు బెండకాయ 60 రూపాయలు అలాగే మార్కెట్లో అతి తక్కువ ధర పలికే టమాటా కిలో 25 రూపాయలు పలుకుతుంది. ఇక ఉల్లితో  పాటు ఆకుకూరల ధరలు కూడా సామాన్యులకు గుండెపోటు తెప్పిస్తున్నాయి. హోల్ సేల్ కిలో అల్లం 150 రూపాయల పైన ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట లేకపోవడంతో నాణ్యత లేకపోవడం కొత్త పంట రాకపోవడంతో ధరలు అధికంగా పెరిగినట్లు వ్యాపారస్థులు చెబుతున్నారు. దీనితో సామాన్యుడు ఏ కూరగాయ కులాలు ఉన్నా ఎంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్