రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతుండడంతో అనేక ప్రాంతాల్లో చలి ప్రజలను పనికిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో సాయంత్రం వేళ బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్మేస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రహదారిని పూర్తిగా కమ్మేసిన మంచు
రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతుండడంతో అనేక ప్రాంతాల్లో చలి ప్రజలను పనికిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో సాయంత్రం వేళ బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్మేస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే అనేక ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనయంగా పడిపోతున్నాయి. ఇటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో, ఏపీలోని కోనసీమ, శ్రీకాకుళం జిల్లాలో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం చలికి గజగజ వణుకుతున్నారు. పొగ మంచు, చలి ప్రభావంతో ప్రజలు ఎలా నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని దీనివల్ల చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు నగర్ శివారు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు మంచి తీవ్రత అధికంగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెమ్మదిగా ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి వాహనదారులకు ఎదురవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారుల పైన ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూ ఉండడంతో వాహనాల వేగం తగు ముఖం పట్టింది. ఇది ఎలా ఉంటే అలముకున్న పొగ మంచు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. అనేక ప్రాంతాల్లోనే ప్రకృతి ప్రేమికులు మంచు తుంపర్లను ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలో తీసుకుంటూ ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వాతావరణం కోసం అనేకమంది పర్యాటకులు విశాఖ ఏజెన్సీతోపాటు అనేక ప్రాంతాలకు వెళుతున్నారు. కుటుంబ సమేతంగా టూర్లు కూడా వేస్తున్నారు.
ఏజెన్సీలో కాశ్మీరును తలపిస్తున్న వాతావరణం అనేక చోట్ల కనిపిస్తోంది. ఇక ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాలను మంచిదొక్కటి కప్పేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మంచు ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనుచూపుమేరలో రహదారులు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం వేళ బయటకు రాకుండా ఉండడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిమోనియా, ఆస్తమా వంటి ఇబ్బందులతో బాధపడేవారు చల్లగాలులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం వేళల్లో బయటకు రాకుండా ఉండటం వల్ల వీరి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురుగా కాకుండా చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మంచు అధికంగా కురిసే ప్రాంతాల్లో సాధారణ ప్రజలు కూడా ఉదయం వేళల్లో వాకింగ్ వంటివి చేయకుండా ఉండడం మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మంచు తగ్గుముఖం పట్టిన తర్వాత వాకింగ్, జాగింగ్ కు వెళ్లడం శ్రేయస్కారంగా నిపుణుల పేర్కొంటున్నారు.