||ఈగరుడ బస్సు||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో మొత్తం 50 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించినట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అందులో ముందుగా 10 బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. మిగతా బస్సులను విడతల వారీగా ఈ ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని వివరించింది. ఈ బస్సులకు ఈ-గరుడ అని పేరు పెట్టినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మంగళవారం రోజున మియాపూర్లోని బస్ పాయింట్ వద్ద ఈ బస్సులను రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ-గరుడ విశేషాలు: