నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. పెద్ద ఎత్తున వేడుకలను జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధమవుతున్నారు. వేడుకల కోసం ఇప్పటికే ప్రముఖ హోటల్స్ తోపాటు రిసార్ట్స్, అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు నూతన సంవత్సర వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో మంగళవారం రాత్రి నుంచి భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రతీకాత్మక చిత్రం
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. పెద్ద ఎత్తున వేడుకలను జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధమవుతున్నారు. వేడుకల కోసం ఇప్పటికే ప్రముఖ హోటల్స్ తోపాటు రిసార్ట్స్, అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు నూతన సంవత్సర వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో మంగళవారం రాత్రి నుంచి భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపట్టనున్నారు. మద్యం తాగి ఎవరైనా పట్టుబడితే వాహనం చీజ్ చేయడంతోపాటు భారీగా జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి ట్రాఫిక్కు అనుమతి ఉండదని పోలీసులు వెల్లడించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టు వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత దృష్ట్యా అవుటర్ రింగ్ రోడ్డు డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. అలాగే నాగోల్ ఫ్లైఓవర్, కామినేని ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ ఎక్స్ రోడ్డులోని మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు, బైరామల్ గూడా ఎక్స్ రోడ్లోని మొదటి, రెండో లెవెల్ ఫ్లై ఓవర్లు, ఎల్బీనగర్ అండర్పాస్, చింతలకుంట అండర్పాస్లను రాత్రి పది గంటల నుంచి లైట్ మోటార్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. బేగంపేట, టోలిచౌకి నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మంగళవారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు మూసివేయనున్నారు. విమాన టికెట్లు ఉండి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులను మాత్రమే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ పై అనుమతించనున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్, ప్యాసింజర్ వాహనాలకు నగరంలోకి అనుమతి ఉండదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
నూతన సంవత్సర వేడుకలు నేపథ్యంలో బార్, పబ్, క్లబ్బులో తమ ప్రాంగణాల్లో కస్టమర్లను మద్యం సేవించి వాహనాలు నడపడానికి అనుమతిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని రహదారుల్లో మద్యం తాగి వాహనాలు నడిపితే కస్టడీకి తీసుకుంటామని ఈ మేరకు రోడ్లపై విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ట్యాంక్ బండకు కాలినడకన వెళ్లాలనుకునే సందర్శకుల వాహనాలు సెక్రటేరియట్ విజిటర్స్ పార్కింగ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన హెచ్ఎండిఏ మైదానం, జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం లైన్, రేస్ కోర్స్ రోడ్డు, ఆదర్శనగర్ లైన్ వద్ద పార్కింగ్ స్థలం కేటాయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్యాబ్లు, టాక్సీలు, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించడంతోపాటు డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. లేదంటే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు డ్రైవర్లు నిరాకరించడం, అదనపు చార్జీలు వసూలు చేయడం వంటివి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పౌరులకు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి కమిషనరేట్ పరిధిలో అన్ని రహదారులు కూడళ్ళలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. వాహనాలపైకి ఎక్కి అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. పోలీసులు డిసెంబర్ 31వ తేదీన విధించనున్న ట్రాఫిక్ ఆంక్షలతోపాటు ఇతర యాక్టివిటీస్ సంబంధించి కేసులు నమోదు చేస్తామని తెలిపిన నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే కేసులను ఎదుర్కొని ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.