ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఏపీలోనే అనేక ప్రాంతాలతోపాటు తెలంగాణలోని హైదరాబాదులో కూడా పలు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మెయిన్స్ పరీక్షలకు సుమారు 92,500 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఆదివారం మెయిన్స్ పరీక్ష జరగనుండగా.. ఈ పరీక్షకు హాజరు కావలసిన అభ్యర్థులు మాత్రం రోడ్డు ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. దీనికి రోస్టర్ విధానంలో ఉన్న తప్పులే కారణంగా తెలుస్తోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, వివాదాలతో ఇప్పటివరకు మెయిన్స్ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఓటమి ప్రభుత్వం ఈనెల 23న మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన
ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఏపీలోనే అనేక ప్రాంతాలతోపాటు తెలంగాణలోని హైదరాబాదులో కూడా పలు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మెయిన్స్ పరీక్షలకు సుమారు 92,500 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఆదివారం మెయిన్స్ పరీక్ష జరగనుండగా.. ఈ పరీక్షకు హాజరు కావలసిన అభ్యర్థులు మాత్రం రోడ్డు ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. దీనికి రోస్టర్ విధానంలో ఉన్న తప్పులే కారణంగా తెలుస్తోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, వివాదాలతో ఇప్పటివరకు మెయిన్స్ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఓటమి ప్రభుత్వం ఈనెల 23న మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే రోస్టర్ విధానం సరిగా లేదంటూ మెయిన్స్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించిన అభ్యర్థులు గడిచిన కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. పాస్టర్ విధానం సరిచేయకుండా మెయిన్స్ నిర్వహిస్తే భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించిన వారు కూడా నష్టపోవాల్సి వస్తుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఆలస్యమైన మెయిన్స్ పరీక్ష వాయిదా వేసి రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సరిచేయాలని కోరుతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వేల మంది అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఏపీపీఎస్సీ ఒక కీలక ప్రకటన తాజాగా చేసింది. మరోసారి పోస్టు, జోనల్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేసింది.. పరీక్షలు రాసిన అనంతరం దీనికి అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఫలితాలు వచ్చిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఈ ప్రక్రియ చేపడుతామని తెలిపింది.
ఇప్పటికే ఆలస్యం అయినందున పరీక్ష వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించిన ఏపీపీఎస్సీ.. మధ్య మార్గంగా ఈ ఆలోచన చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల అభ్యర్థులు ఎలా స్పందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి తీర్పు వెల్లడించిన హైకోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయడానికి నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు గ్రూప్ 2 అభ్యర్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తోపాటు ఏపీలోని అనేక ప్రాంతాల్లో మెయిన్స్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీతో పాటు వైసిపి కూడా మద్దతు తెలియజేసింది. పాస్టర్ విధానంలో ఉన్న తప్పులను సరిచేసిన తర్వాతే మెయిన్స్ నిర్వహించాలంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంటుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.