నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. లెక్కింపు ఏర్పాట్లు పూర్తి

ఏపీ, తెలంగాణలో కొద్దిరోజుల కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడలు ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సోమవారం సాయంత్రం నాటికే వెలువడుతాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు రెండు రోజులు సమయం పెట్టి అవకాశం ఉంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు గత నెల 27న జరిగాయి. మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరి భవిత వ్యయం సోమవారం తేలుతుంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణ - గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది.

Ready Counting staff

సిద్ధంగా ఉన్న కౌంటింగ్ సిబ్బంది

ఏపీ, తెలంగాణలో కొద్దిరోజుల కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడలు ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సోమవారం సాయంత్రం నాటికే వెలువడుతాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు రెండు రోజులు సమయం పెట్టి అవకాశం ఉంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు గత నెల 27న జరిగాయి. మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరి భవిత వ్యయం సోమవారం తేలుతుంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణ - గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు స్థానాలకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండడంతో తుది ఫలితాలు వెలువడేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టు వ్యక్తమైన ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అధికార తెలుగుదేశం పార్టీ ఒకరికి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం నేరుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఏపీలో కీలక పార్టీ అయినా వైసీపీ మాత్రం ప్రత్యక్షంగా ఎవరికి మద్దతు ప్రకటించలేదు. ఎన్నికల్లో ఆ పార్టీ పోటీకి దూరంగా ఉంది. 

తెలంగాణలో ఎమ్మెల్సీ ఫలితాలు నేడే..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్, నల్లగొండలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాటు చేశారు. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సోమవారం సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కరీంనగర్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఎందుకోసం మొత్తంగా 35టేబుళ్లు వినియోగిస్తున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుల్ లో ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ముక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరూ లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బంది వినియోగించడం అన్నారు. ఇందులో 20 శాతం మంది రిజర్వ సిబ్బంది ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. గత నెల 24వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించినన్నారు. ఇందుకోసం అసెంబ్లీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈనెల 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్