నేడే వైసిపి తొలి పోరు.. రైతు సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్ తో రోడ్డుపైకి

ఏపీలోనే కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుకు సిద్ధమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే శుక్రవారం తొలి పోరుకు ఆయన పిలుపునిచ్చారు. తొలి పోరు రైతుల సమస్యలపైనే ఉండడం గమనార్హం. రెండు సీజన్ లో గడుస్తున్న పెట్టుబడి సాయం రూ.20 వేలు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోనే కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుకు సిద్ధమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే శుక్రవారం తొలి పోరుకు ఆయన పిలుపునిచ్చారు. తొలి పోరు రైతుల సమస్యలపైనే ఉండడం గమనార్హం. రెండు సీజన్ లో గడుస్తున్న పెట్టుబడి సాయం రూ.20 వేలు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర దక్కక, ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక రైతుల దిక్కు తోచని స్థితిలో ఉన్నారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ పోరుకు పిలుపునిచ్చారు. ఈ పోరులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు వైసిపి సన్నద్ధమవుతోంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందించనున్నారు వైసీపీ నాయకులు. వైసీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలిసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. కూటమి సర్కారు వైఫల్యాలను ఎండ కొడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుమేరకు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైసిపి నాయకులు చెబుతున్నారు. 

వైసిపి ప్రతిపక్షంలోకి వెళ్లిన తరువాత తొలి ప్రజా పోరాటం ఇదే కావడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా పార్టీ నాయకులు తీసుకున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై కలెక్టరేట్ వద్ద ముఖ్య నాయకులు ప్రసంగించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడనున్నారు. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలను అందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయమన్నారు. ప్రతి జిల్లాలోనూ ముఖ్య నాయకులంతా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేలా పార్టీ నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు పార్టీ నాయకులు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, నాయకులు రైతులను తీసుకొని కలెక్టరేట్ కు వెళ్ళనున్నారు. అక్కడ రైతులను ఉద్దేశించి జిల్లా స్థాయి నాయకులు ప్రసంగించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఎలా దగా చేసిందన్న విషయాన్ని కూడా ముఖ్య నాయకులు ప్రజలకు వివరించనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిన మేలును ఈ సందర్భంగా తెలియజేస్తారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్