బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న కొనుగోలు మాత్రం తగ్గడం లేదు. ఏటా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న పసిడి ప్రియులు సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందుకే బంగారం ధర జెట్ స్పీడ్ తో పెరుగుతోంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు రికార్డు స్థాయికి ఎగబాకుతో పోతున్నప్పటికీ బంగారం కొనుగోలు విషయంలో భారతీయులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు గడిచిన ఏడాది భారతదేశంలో పసిడి గిరాకీ వార్షిక ప్రాతపదికన 5% పెరిగి 802.8 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై శంఖం తగ్గించడంతోపాటు పండగలు, పెళ్లిళ్లు సీజన్ కొనుగోల్లు డిమాండ్ వృద్ధికి ప్రధానంగా దోహదం పడ్డాయని ఆ నివేదికలో తెలిపారు.
ప్రతీకాత్మక చిత్రం
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న కొనుగోలు మాత్రం తగ్గడం లేదు. ఏటా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న పసిడి ప్రియులు సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందుకే బంగారం ధర జెట్ స్పీడ్ తో పెరుగుతోంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు రికార్డు స్థాయికి ఎగబాకుతో పోతున్నప్పటికీ బంగారం కొనుగోలు విషయంలో భారతీయులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు గడిచిన ఏడాది భారతదేశంలో పసిడి గిరాకీ వార్షిక ప్రాతపదికన 5% పెరిగి 802.8 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై శంఖం తగ్గించడంతోపాటు పండగలు, పెళ్లిళ్లు సీజన్ కొనుగోల్లు డిమాండ్ వృద్ధికి ప్రధానంగా దోహదం పడ్డాయని ఆ నివేదికలో తెలిపారు. ఈ ఏడాదిలోను భారత్ లో బంగారం డిమాండు 80 టన్నుల స్థాయిలో ఉండవచ్చని అంచనా వేశారు. ధరల అనూష పెరుగుదలతో మందగించిన ఆభరణాల కొనుగోలు పెళ్లిళ్ల సీజన్లో మళ్ళీ పుంజుకోవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024లో భారత పసిడి గిరాకీ విలువపరంగా 31% పెరిగి రూ.5,15,390 కోట్లకు పెరిగింది. 2023లో ఇది రూ.3,92,00 కోట్లు గా ఉంది. 2024 అక్టోబరు - డిసెంబర్ త్రైమాషికంలో గిరాకీ ఎలాంటి వృద్ధి లేకుండా 265.8 టన్నులుగా నమోదయింది. గత సంవత్సరంలో స్వర్ణాభరణాల కొనుగోలు మాత్రం వార్షిక ప్రాతిపదికన రెండు శాతం తగ్గి రూ.563.4 టన్నులకు పరిమితమయ్యాయి.
2023లో 578.8 టన్నుల కొనుగోలు జరిగాయి. అయినప్పటికీ భారత్, చైనా కంటే అధిక నగలు కొనుగోలు చేసింది. 2024లో చైనాలో గోల్డ్ జ్యువెలరీ డిమాండు 511.4 టన్నులుగా నమోదయింది. గడిచిన ఏడాది బంగారంలో పెట్టుబడులు 29% పెరిగి 239.4 టన్నులకు చేరాయి. 2023లో ఇది 185.2 టన్నులుగా ఉంది. అనిచ్చితి సమయాల్లో బంగారం భద్రమైన పెట్టుబడి సాధనం అనడానికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. 2024లో 114.3 తనుల గోల్డ్ రీసైక్లింగ్ జరిగింది. 2023లో జరిగిన 117.1 టన్నులతో పోలిస్తే రెండు శాతం తగ్గింది. గత సంవత్సరం భారతలోకి బంగారం దిగుమతులు నాలుగు శాతం తగ్గి 712.1 టన్నులుగా నమోదయింది. 2023లో 74 టన్నులు దిగిమతయింది. గడిచిన ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పసిడి గిరాకీ 4,974 టన్నులుగా నమోదయింది. ఇందులో 1044.6 టన్నుల బంగారాన్ని వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులే కొనుగోలు చేశాయి. అంటే ప్రపంచ డిమాండ్ లో 20 శాతానికి పైగా వాటా వీటిదే. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఒక సంవత్సరంలో వెయ్యి తన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేయడం వరుసుగా ఇది మూడోసారి. ఆర్.బి.ఐ గత ఏడాది మరో 73 టన్నుల బంగారం సమకూర్చుకుంది. 2023లో 16 టన్నులు కొనుగోలు చేసింది.