సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన, పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టేదే లేదని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో గురువారం మాట్లాడారు. వైసీపీ నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.
హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన, పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టేదే లేదని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో గురువారం మాట్లాడారు. వైసీపీ నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారాని, ఇది సహించే విషయం కాదని మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని, ఆ తర్వాత పోస్టులు డిలీట్ చేశారని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ అటువంటి వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ తరహా దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని, సొంత తల్లిని, చెల్లిని తిట్టినవారిని జగన్ ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లిని, చెల్లిని తిట్టిన వారిని తాము అరెస్టు చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు.
సోషల్ సైకోలకు జగనే నాయకుడని అనిత విమర్శించారు. వైసీపీ సైతాన్ సోషల్ మీడియా సైన్యానికి వైఎస్ జగనే నాయకుడని, తనపై తప్పుడు ప్రచారం చేయించింది కూడా ఆయనేనని కాంగ్రెస్పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపడిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి అనిత గుర్తు చేశారు. సైతాన్ సైన్యంలో విషపు నాగులతోపాటు అనకొండను కూడా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారని, తాము అదే పని చేస్తున్నామన్నారు. కఠినంగా వ్యవహరించకపోతే సైకో సోషల్ మీడియా ఆగడాలు ఆగవని మంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియా సైతాన్లకు జగన్మోహన్రెడ్డే ఈ తరహా ఆదేశాలు జారీ చేశారని, పోస్ట్లు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ఆర్జీవీ మీద కేసు నమోదైందని, ఏపీ తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నమోదు చేశారన్నారు. ఈ కేసులోనూ నోటీసులిచ్చే అవకాశం ఉందనీ, ట్విట్టర్లో తనదైన స్టయిల్ లో రియాక్టవడం వర్మకు అలవాటన్నారు.
ఏపీ అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం..
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం గురువారం ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిలో ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ చట్ట సవరణ బిల్లు, ఆయుర్వేదిక్, హోమియో ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ మెడికల్ ప్రాక్టీషనర్ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టారు. ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ సుంకం చట్ట సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టారు.