శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు శరీరంలోని నీటి స్థాయిని నియంత్రిస్తాయి. నైట్రోజన్, విషపదార్థాలు ఎలక్ట్రోలైట్స్ తో బ్యాలెన్స్ చేస్తాయి. ఈ ప్రక్రియ సక్రమంగా జరగకపోతే మూత్రపిండాలు వ్యాధి, గుండె సమస్యలు, అధిక రక్తపోటు వంటి ఇబ్బందులు వస్తాయి. కిడ్నీలో ఫెయిల్ అయితే ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించడం ద్వారా అప్రమత్తం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే ఫిల్టర్లు మాదిరిగా కిడ్నీలు పనిచేస్తాయి.
కిడ్నీలు
శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు శరీరంలోని నీటి స్థాయిని నియంత్రిస్తాయి. నైట్రోజన్, విషపదార్థాలు ఎలక్ట్రోలైట్స్ తో బ్యాలెన్స్ చేస్తాయి. ఈ ప్రక్రియ సక్రమంగా జరగకపోతే మూత్రపిండాలు వ్యాధి, గుండె సమస్యలు, అధిక రక్తపోటు వంటి ఇబ్బందులు వస్తాయి. కిడ్నీలో ఫెయిల్ అయితే ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించడం ద్వారా అప్రమత్తం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే ఫిల్టర్లు మాదిరిగా కిడ్నీలు పనిచేస్తాయి. రక్తంలోని వ్యర్ధాలు, విష పదార్థాలను వడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపడం వీటి పని. ఇవి సక్రమంగా పనిచేయకపోతే శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది. చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమై తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కిడ్నీ ఫెయిల్ పెయిన్, కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించిన లక్షణాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు లేదా ఇన్ఫెక్షన్ లో ఉన్న వారిలో వెన్నుభాగం లేదా కడుపు కింద భాగంలో నొప్పి వస్తుంది.
ఎవరు ఎందుకు సంబంధించిన సమస్యలు కూడా కిడ్నీలు సమస్యను సూచిస్తాయి. తరచుగా మూత్ర విసర్జనకు పోవాల్సి వస్తుంది. మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. మూత్రంలో రక్తం లేదా నురగ వంటివి కనిపిస్తాయి. ఈ నొప్పి కూడా ఒకసారి కాకుండా ఆగి ఆగి రావచ్చు. మూత్రంలో రక్తం గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపించవచ్చు ఈ నొప్పి కారణంగా కొంతమందికి వికారం వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో జ్వరం రావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ తలెత్తితే మాత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం, జ్వరం రావడం, శరీరంలో ఏదో ఒక భాగంలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీల సామర్థ్యం తగ్గితే శరీరంలో నీరు నిలువ ఉండి వాపు వస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల అలసట, బలహీనత వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి.
కిడ్నీ వ్యాధి అంటే శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే ఫిల్టర్లు అయిన మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం గా గుర్తించాలి. ఇది మెల్లగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ కు దారి తీస్తే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రారంభ దశలో ఎప్పుడూ నొప్పిని కలిగించకపోయినా.. అలసట, మూత్రం సంబంధిత సమస్యల వంటి ఇతర లక్షణాలను చూపిస్తుంది. సాధారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లు, అధికంగా మందులు వాడడం వల్ల మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొంతమంది ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. ఆహారంలో అధికంగా ఉప్పు వినియోగించడం, చక్కెర పదార్థాలు అధికంగా తినడం, తగినంత నీరు తాగకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటివి మూత్రపిండాలకు హానిని కలిగిస్తాయి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయని నిపుణులు చూపిస్తున్నారు. ధూమపానం, మద్యపానం కూడా కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉప్పు, చక్కెర, ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు రెండు మూడు లీటర్ల నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. సిగరెట్, మద్యం పంట అలవాటులకు దూరంగా ఉండడం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు మూత్రపిండాల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదిస్తుండడం వలన కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.