నక్సల్స్ కు దడ పుట్టిస్తున్న యుఏవీ డ్రోన్లు.. డే అండ్ నైట్ ఆపరేషన్స్ లో కీలకం

మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం మరింత పట్టు బిగిస్తోంది. టచ్ చేయలేరు అనుకున్న మావోయిస్టు అగ్రనేతలను సైతం ఎన్కౌంటర్లలో కడతేర్చుతోంది. సాయుధ తీవ్రవాదంపై ఎట్టకేలకు కేంద్రంపై చేయి సాధించగలిగింది. ఈ ఆపరేషన్ లో భద్రతా బలగాలకు ప్రధానంగా డ్రోన్ లో సహకారాన్ని అందిస్తున్నాయి. అడవులు, కొండలు, గుట్టలు, నదీ ప్రాంతాలు ఇలా ఎంతో సంక్లిష్టమైన ప్రాంతంలో కూడా ఇవి టార్గెట్ ను గుర్తించగలవు. దేశ సరిహద్దు ప్రాంతాలు వ్యూహాత్మక రక్షణ ప్రాంతాలు వద్ద ఏరియల్ సర్వేలైన్స్ ను వాడతారు. కేంద్రం 2022 నుంచి దీనిని దండకారణ్యంలోకి తీసుకువచ్చింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం మరింత పట్టు బిగిస్తోంది. టచ్ చేయలేరు అనుకున్న మావోయిస్టు అగ్రనేతలను సైతం ఎన్కౌంటర్లలో కడతేర్చుతోంది. సాయుధ తీవ్రవాదంపై ఎట్టకేలకు కేంద్రంపై చేయి సాధించగలిగింది. ఈ ఆపరేషన్ లో భద్రతా బలగాలకు ప్రధానంగా డ్రోన్ లో సహకారాన్ని అందిస్తున్నాయి. అడవులు, కొండలు, గుట్టలు, నదీ ప్రాంతాలు ఇలా ఎంతో సంక్లిష్టమైన ప్రాంతంలో కూడా ఇవి టార్గెట్ ను గుర్తించగలవు. దేశ సరిహద్దు ప్రాంతాలు వ్యూహాత్మక రక్షణ ప్రాంతాలు వద్ద ఏరియల్ సర్వేలైన్స్ ను వాడతారు. కేంద్రం 2022 నుంచి దీనిని దండకారణ్యంలోకి తీసుకువచ్చింది. దీని ప్రభావంతో కూంబింగ్ ఆపరేషన్స్ లో ఉన్న కష్టాలు తొలగిపోయాయి. ఇన్ఫార్మర్ వ్యవస్థ ఇప్పుడు పెద్దగా అవసరం లేకుండా పోయింది. ఆకాశంలో ఉదయం, రాత్రి తేడా లేకుండా  ఆకాశం నుంచే టార్గెట్ ఆనవాళ్లు, కదలికలను గుర్తించి ప్రత్యక్ష సమాచారం. పక్క లొకేషన్ ను అందించగల మానవరహిత డ్రోన్ (యుఏవి) లు దండకారణ్య సర్వలైన్స్ లో పనిచేస్తున్నాయి. మొత్తంగా 28 యుఏవీలను మోహరించారు. అందుకే ధీమాగా 2026 నాటికి మావోయిస్టులు అడవిలో లేకుండా చేస్తామని కేంద్రం పదేపదే ప్రకటనలు చేస్తోంది. ఈ తెగువ వెనుక ఉన్న అసలైన బలం స్విచబుల్ యూఏవీలు. ఇప్పుడు మావోయిస్టుల గుండెకాయ దండకారణ్యంలో కల్లోలాన్ని రాజేస్తున్నాయి. 

ఒకసారి ఆకాశంలోకి టేకాఫ్ అయితే ఏకధాటిగా రెండున్నర గంటలపాటు ఫోటోలు, వీడియో, లైవ్ స్ట్రీమింగ్ ను స్విచ్ యూఏవీ డ్రోన్లు ఇవ్వగలవు. సగటున భూమి నుంచి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు. టేకాఫ్ అయినప్పుడు తప్ప ఆకాశంలో ఉన్నప్పుడు ఇవి శబ్దం చేయవు. అదే వీటి ప్రత్యేకత. స్టెల్త్ మోడ్ లో పని చేస్తాయి. డ్రోన్ హై డెఫినేషన్ కెమెరాకు 25 ఎక్స్ జూమ్ సామర్థ్యం ఉంటుంది. ఆకాశం నుంచి నేలపై లేదా అడవి, మదిలో వెయ్యి మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లు కూడా గుర్తించి లక్ష్యంగా చేసుకోగలగడం దీనికి ప్రత్యేకత. రాత్రి వేళల్లో ఇంకా విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం నేలపై ఉన్న టార్గెట్లు, మనుషులను స్పష్టంగా గుర్తించగలిగేలా థర్మల్ కెమెరా ఉంటుంది. దీని సాయంతో అర్ధరాత్రిలు కూడా నేలపై ఉండే మనుషులు, ఇతర టార్గెట్ల కదలికలు గుర్తించి ఫోటోలు తీయగలదు. అనంతరం రూట్ మ్యాప్ కూడా ఇస్తుంది. 

ఏరియల్ సర్వేలెన్స్ కోసం 2022లో కేంద్రం 220కిపైగా స్విచ్ యూఏవీలను భారత్ సైన్యానికి అందించింది. ఇది కాకుండా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లకు మరో 40 డ్రోన్స్ ఇచ్చింది. కార్యక్షేత్రంలో వీటి పనితీరు అద్భుతంగా ఉందని నిర్ధారణ కావడంతో తొలుత 10 ద్రోన్లను దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో పాల్గొంటున్న కమాండ్ కంట్రోల్ కు ఇచ్చింది. వీటిని చూసి ఒడిస్సా, చత్తీష్ ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు విడివిడిగా ఈ డ్రోన్లులను సమకూర్చుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం మావోయిస్టు ఏర్వేద ఆపరేషన్ చేస్తున్న దండకారణ్యం కమాండ్ కంట్రోల్ పరిధిలో 28 డ్రోన్లు ఇప్పుడు ఆకాశ నిఘా నిర్వహిస్తున్నాయి. వీటి వల్లే తాజాగా భారీ ఆపరేషన్ నిర్వహించి పెద్ద నేతలను కూడా మట్టు పెట్టగలిగారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్