అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధితుల స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిరోజుల్లోనే భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరుదేశాలకు సంబంధించి ఉన్నత స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన నరేంద్ర మోడీ, ట్రంప్ అత్యంత సన్నిహితులు. వీరిద్దరి కలయికకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలను స్వీకరించిన కార్యక్రమానికి నరేంద్ర మోడీ దూతగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హాజరయ్యారు. ఆయనకు ముందు వరసలో ట్రంప్ స్థానాన్ని కేటాయించారు. దీనిని బట్టి ప్రధాని నరేంద్ర మోడీకి ట్రంప్ ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
డొనాల్డ్ ట్రంప్, మోడీ
అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధితుల స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిరోజుల్లోనే భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరుదేశాలకు సంబంధించి ఉన్నత స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన నరేంద్ర మోడీ, ట్రంప్ అత్యంత సన్నిహితులు. వీరిద్దరి కలయికకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలను స్వీకరించిన కార్యక్రమానికి నరేంద్ర మోడీ దూతగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హాజరయ్యారు. ఆయనకు ముందు వరసలో ట్రంప్ స్థానాన్ని కేటాయించారు. దీనిని బట్టి ప్రధాని నరేంద్ర మోడీకి ట్రంప్ ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఎప్పుడు భేటీ అవుతారు అన్నదానిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు అగ్రనేతల భేటీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరువురు నేతలు సమావేశం కావడానికి సంబంధించిన షెడ్యూల్ నిర్ణయినట్లు తెలుస్తోంది. ఈనెల 13న రంపుతో ప్రధాన మోడీ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో ప్రధాన నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్ళనున్నారు.
అమెరికా పర్యటనలోనే ట్రంప్ తో మోడీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న భారతీయులకు సంబంధించి ట్రంప్ కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీనివల్ల లక్షలాదిమంది భారతీయులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలకు పరిష్కారాన్ని తీసుకువచ్చేలా ప్రధాని మోదీ ట్రంప్ తో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. వీటితోపాటు ఇరు దేశాలకు సంబంధించి రక్షణ పరమైన కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇరువురు భేటీ నేపథ్యంలో ఇరుదేశాలకు సంబంధించిన ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇద్దరూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతలు కావడంతో వీరి కలయికకు ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి కలయిక అనంతరం ఎటువంటి ప్రకటన వెలువబడుతుంది అన్నదానిపైన ప్రాధాన్యత నెలకొంది.