దేశంలో బంగారం ధర రోజు రోజుకు ఎగబాకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండికి డిమాండ్ అధికంగా పెరుగుతుండడంతో ధర కూడా క్రమంగా పెరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధర కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరి కొన్నిసార్లు భారీగా పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలో ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా పెరుగుతూ వచ్చిన ధరలు జనాలకు షాక్ ఇస్తున్నాయి.
పెరుగుతున్న బంగారం ధర
దేశంలో బంగారం ధర రోజు రోజుకు ఎగబాకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండికి డిమాండ్ అధికంగా పెరుగుతుండడంతో ధర కూడా క్రమంగా పెరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధర కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరి కొన్నిసార్లు భారీగా పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలో ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా పెరుగుతూ వచ్చిన ధరలు జనాలకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఏకంగా రూ.430 మేరకు పెరిగి రూ.78,990 కి చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రూ.390కిపైగా పెరిగి రూ.72,410కి చేరింది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్ నిల్వ వంటి అంశాలు గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ఆదివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,930 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.79,570కి చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,800గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.79,420 కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,420 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర రూ.72,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.79,420 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,420 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,800 కాగా, 24 క్యారెట్లు బంగారం ధర రూ.79,420 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తే వెండి ధరల్లోను స్వల్ప పెరుగుదల కనిపించింది. ఆదివారం కిలో వెండి ధరలో ఎలాంటి పెరుగుదల లేదని తెలుస్తోంది. ఢిల్లీతోపాటు కోల్ కతా, ముంబై, పూణే వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ.99,500 చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది. ఈ ధరలు ఆదివారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఇక మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవచ్చు. బంగారం ధరలు తెలుసుకోవడానికి 8955664433 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.