గత వైసిపి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశంపై మాటలతో విరుచుకుపడిన నేతలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాలకు చెందిన ఎంతోమంది నేతలను అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ చెప్పినట్టుగా రెడ్ బుక్ లో నమోదు చేసిన అధికారులు, నాయకులు లక్ష్యంగా కేసులు పెడుతూ జైళ్ళకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీకి కూడా పంపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది.
వల్లభనేని వంశీ, కొడాలి నాని
గత వైసిపి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశంపై మాటలతో విరుచుకుపడిన నేతలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాలకు చెందిన ఎంతోమంది నేతలను అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ చెప్పినట్టుగా రెడ్ బుక్ లో నమోదు చేసిన అధికారులు, నాయకులు లక్ష్యంగా కేసులు పెడుతూ జైళ్ళకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీకి కూడా పంపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. ఆ తరువాత ఎవరు అన్నదానిపై ప్రస్తుతం కూటమి పార్టీల నాయకులతోపాటు వైసీపీలో కూడా చర్చ నడుస్తోంది. దీనికి సమాధానంగా కూటమి నాయకులే కొన్ని పేర్లు చెబుతున్నారు. ఆ తర్వాత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని లిస్టులో ఉన్నాడంటూ టిడిపికి చెందిన పలువురు సీనియర్ నేతలు స్వయంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పేర్ని నాని వంటి వాళ్ళు జైలు ఊచలు లెక్కించాల్సిందే అన్నట్టుగా ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వ పెద్దలు కార్యాచరణను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఈ అరెస్టులకు కారణం అదేనా.!
వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు అప్పట్లో నోటి దురుసుతో వ్యవహరించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, భువనేశ్వరి వంటి వారి పేర్లు చెప్పు మరి అప్పట్లో తీవ్ర స్థాయిలో వీరంతా దుర్భాషలాడారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అప్పట్లో టిడిపికి చెందిన సోషల్ మీడియా వల్లభనేని వంశీ, కొడాలి నాని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. వ్యక్తిగత విషయాలను కూడా సామాజిక మాధ్యమాలు వేదికగా బయటకు పెట్టాయి. ఈ కారణాలతోనే అప్పట్లో ఈ ఇద్దరు నేతలు టిడిపికి చెందిన అగ్ర నాయకులను దుర్భాసలాడినట్లు చెబుతారు. అయితే అప్పట్లో మాట్లాడిన మాటలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కేసులు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. గతంలోనే కొడాలి నాని కేసులకు భయపడేది లేదు అనే ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అరెస్టు కావడం, ఆ తర్వాత లిస్టులో కొడాలి నాని ఉన్నారంటూ ప్రచారం జరుగుతుండడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో అరెస్టు చేశారు. మరి కొడాలి నాని ఏ కేసులో అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందో చూడాల్సి ఉంది.