ఏపీని గడిచిన కొద్ది రోజుల నుంచి సరికొత్త వ్యాధులు వెంటాడుతున్నాయి. కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో వేలాది కోళ్లను నాశనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజుల నుంచి బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. ఒకవైపు బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండగా మరోవైపు బులియన్ బారె సిండ్రోమ్ (జిపిఎస్) కేసుల నమోదు కావడం, దీని బారినపడి పలువురు మృతి చెందడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీని గడిచిన కొద్ది రోజుల నుంచి సరికొత్త వ్యాధులు వెంటాడుతున్నాయి. కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో వేలాది కోళ్లను నాశనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజుల నుంచి బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. ఒకవైపు బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండగా మరోవైపు బులియన్ బారె సిండ్రోమ్ (జిపిఎస్) కేసుల నమోదు కావడం, దీని బారినపడి పలువురు మృతి చెందడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈ కేసులు భారీగా నమోదవుతుండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకవైపు బర్డ్ ఫ్లూ, మరోవైపు జిబిఎస్ రాష్ట్రాన్ని వనికిస్తుంటే.. తాజాగా మరో వ్యాధి విజృంభిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇది కూడా కోళ్లకు రావడం.. అందులోనూ నాటు కోళ్లు ఈ మహమ్మారి బారిన పడి వందలాదిగా మృత్యువాత చెందుతూ ఉండడంతో ప్రజలతోపాటు అధికార యంత్రాంగం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకు ఉభయ గోదావరి జిల్లాలను వనికించిన బర్డ్ ఫ్లూ తరహాలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో నాటు కోళ్లు భారీ సంఖ్యలో మృత్యువాత చెందుతున్నాయి. నాటు కోళ్లు చనిపోవడానికి గల కారణాలపై అధికారులు తెలుసుకోవడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం నాటు కోళ్లు చనిపోవడానికి కూడా బర్డ్ ఫ్లూ కారణము కావచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజోలు దీవిలోని సుమారు 97 గ్రామాల్లో ఈ వైరస్ కారణంగా వందలాది నాటు కోళ్లు మృత్యువాత చెందాయి.
ఈ వైరస్ కారణంగా గడిచిన 15 రోజుల నుంచి నాటు కోళ్లు పిట్టల రాలిపోతున్నాయి. దీంతో నాటు కోళ్లను పెంచుతున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ కట్టడి చేసేందుకు అనేక రకాల వ్యాక్సిన్లు వేయించిన ఫలితం లేకపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోడిని ఏడాదికిపైగా వేళల్లో ఖర్చు చేసి పెంచుకుంటున్నామని, ఇప్పుడు ఒక్కసారిగా వందలాది కోళ్లు మృత్యువాత చెందడంతో భారీగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే వందలాదిమంది రైతులు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. మరోవైపు కోళ్ల ఫారాల్లో అపరిశుభ్ర వాతావరణమే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తికి కారణం అంటున్నారు బస్సు సంవర్ధక శాఖ అధికారులు. ఇదిలా ఉంటే వైరస్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు ఫారం కోళ్లను తినేందుకు ముందుకు రాని ప్రజలు.. నాటు కోళ్ల వైపు దృష్టి సారించారు. అయితే ఇప్పుడు నాటు కోళ్లకు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందడంతో వీటి అమ్మకాలు కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా వరుసగా ఏపీపై వ్యాధులు పంజాబీ విసురుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.