తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి పేర్ని నాని, వంశీ భార్య పంకజ శ్రీ కలిశారు. అనంతరం జైలు బయట వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీని కలిశామని, కింద పడుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పినట్టు వెల్లడించారు. గట్టు ఉన్న ప్రదేశం కేటాయించమని రిక్వెస్ట్ చేశామన్న పేర్ని నాని.. పరిపాలనలో ఉన్న రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం, మానసికంగా ఆనందపరుచుకోవడం కోసమే వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మీడియాతో మాట్లాడుతున్న పేర్ని నాని
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి పేర్ని నాని, వంశీ భార్య పంకజ శ్రీ కలిశారు. అనంతరం జైలు బయట వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీని కలిశామని, కింద పడుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పినట్టు వెల్లడించారు. గట్టు ఉన్న ప్రదేశం కేటాయించమని రిక్వెస్ట్ చేశామన్న పేర్ని నాని.. పరిపాలనలో ఉన్న రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం, మానసికంగా ఆనందపరుచుకోవడం కోసమే వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ తరహా చర్యలతో టీడీపీకి నష్టం తప్పదన్నారు. పదో తేదీన సత్యవర్దన్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారని, 11న ఐదు క్రిమినల్ కేసులు ఉన్న టీడీపీ వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు పెట్టించినట్టు నాని వ్యాఖ్యానించారు. 12వ తేదీన సత్యవర్ధన్ అన్నతో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారని పేర్కొన్నారు. 12వ తేదీ పెట్టించిన కేసులతో 11వ తేదీ కేసు పెట్టిన వ్యక్తి సాక్షిగా ఎలా ఉంటాడని, అసలు పెట్టిన సెక్షన్లకు ఈ కేసుతో సంబంధమే లేదని నాని ఆరోపించారు. ఇదంతా కక్ష సాధింపులో భాగంగానే జరుగుతోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కోర్టుకు కాకఉండా వేరే కోర్టుకు కేసు తీసుకుని వెళ్లి విజయవాడ జైల్లో పెట్టారని ఆరోపించారు. చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టి మరీ పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. భవిష్యత్లో అటువంటి పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటనలో తాను లేనని నాని వివరించారు. మచిలీపట్నంలో కమిషనర్ వద్ద తాను ఉన్నానని స్పష్టం చేశారు. వైసీపీలో యాక్టివ్గా ఉన్న వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారని అసహనాన్ని వ్యక్తం చేసిన నాని.. వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. పోలీసులే ఒక కేసును సిద్ధం చేసుకుంటూ ప్లయింగ్ స్క్వాడ్తో ఫిర్యాదు చేయించారన్నారు. డీజీపీకి తాను లేఖ రాశానని, మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా కోర్టుకు లాగుతానని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో వైసీపీ నాయకులతోపాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారని, రమేష్ హాస్పిటల్ వద్ద 17 మంది కానిస్టేబుల్స్తో ఒక వింగ్ ఏర్పాటు చేసి ఆ ఫోన్ కాల్స్ను ట్రాప్ చేస్తున్నారన్నారు. కొల్లు రవీంద్ర మంత్రి పదవికి పనికి రాడంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నాని.. భవిష్యత్లో అన్నీ తేలుతాయని పేర్కొన్నారు.