మోస్ట్ డేంజరస్ స్పెషల్ ఆపరేషన్, ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొస్సాద్.. టార్గెట్ పెడితే చేదించాల్సిందే

ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్సుడ్ నిఘా సంస్థ మొస్సాద్. ఇజ్రాయిల్ కు చెందిన అత్యంత శక్తివంతమైన నిఘా స్పెషల్ ఆపరేషన్ల సంస్ధ ఇది. ఈ సంస్థ ఒక ఆపరేషన్ ఎంచుకుంటే శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది. హిట్ లిస్టులో ఉన్న శత్రువు భూ ప్రపంచంలో ఎక్కడ దాక్కొని ఉన్న వెతికి వేటాడి చంపడం మొస్సాద్ స్టైల్. విదేశీ గడ్డపై విష ప్రయోగాలు, బాంబుల దాడులు క్షిపణి దాడులతో శత్రువుని మట్టు పెడుతుంది.

Mossad

మొస్సాద్

ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్సుడ్ నిఘా సంస్థ మొస్సాద్. ఇజ్రాయిల్ కు చెందిన అత్యంత శక్తివంతమైన నిఘా స్పెషల్ ఆపరేషన్ల సంస్ధ ఇది. ఈ సంస్థ ఒక ఆపరేషన్ ఎంచుకుంటే శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది. హిట్ లిస్టులో ఉన్న శత్రువు భూ ప్రపంచంలో ఎక్కడ దాక్కొని ఉన్న వెతికి వేటాడి చంపడం మొస్సాద్ స్టైల్. విదేశీ గడ్డపై విష ప్రయోగాలు, బాంబుల దాడులు క్షిపణి దాడులతో శత్రువుని మట్టు పెడుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఆశ్రయం పొందుతున్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యతో మరోసారి మొస్సాజ్ పేరు వార్తల్లోకి ఎక్కింది. 

థండర్ బోల్ట్ పేరుతో ఆపరేషన్ విజయవంతం

1978లో ఆఫ్ఘనిస్తాన్లోని బగ్దాద్ లో వాది హదాద్ హత్య ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తోంది. ఆయన లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ధ్యేయంగా ఏర్పాటు అయిన పాపులర్ ఫ్రంట్ సంస్థకు చీఫ్. 1976లో టెల్ అవీవ్ విమానాశ్రయంలో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేశాడు. అప్పట్లో లెఫ్టినెంట్ కల్నల్ యోనతాన్ నెతన్యాహు (ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సోదరుడు) నేతృత్వంలో థండర్ బోల్ట్ పేరుతో నిర్వహించిన ఆపరేషన్ లో బందీలను విడిపించగలిగారు. ఈ పోరులో యోనతాన్ నెతన్యాహు వీరమరణం పొందారు. దీంతో ఇజ్రాయిల్ హిట్ లిస్టులోకి వాది హదాద్ చేరాడు. బగ్దాద్ లో తలదాచుకున్న వాడిని తుదముట్టించేందుకు ఏజెంట్ సాడ్ నెస్ ను రంగంలోకి దిగాడు. అతను బగ్దాద్ లోని వాది ఇంట్లో పనివాడిలా చేరాడు. 1978 జనవరి 10న వాది వాడే టూత్ పేస్ట్ ను మార్చి ఇజ్రాయిల్ తయారు చేసిన విషపు టూత్ పేస్ట్ ను పెట్టాడు. ఆ పేస్టును వాడిన వాదీ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. జర్మనీకి తరలించినా వైద్యులు ఆయనను బతికించలేకపోయారు. 1978 మార్చి 29న వాది చనిపోయాడు. అయితే మూడు దశాబ్దాలు దాటే వరకు అతను చనిపోవడానికి కారణం విషపు పేస్ట్ అనే విషయం బయట ప్రపంచానికి తెలియదు. పాలస్తీనా లిబరేషన్ కోసం ఖలీల్ మెషాల్ జోర్డాన్ లో తలదాచుకుంటూనే ఇజ్రాయిల్ పై దాడులకు వ్యూహాలను రచించి అమలు చేశాడు. 1997లో మొస్సాద్ ఏజెంట్లు అతని ఇజ్రాయెల్ లో చంపేందుకు స్కెచ్ వేశారు. ఖలీద్ చెవిలో విషాన్ని పిచికారి చేశారు. దీంతో ఖలీద్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు కారణం అవడంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రంగంలోకి దిగారు. ఆయన ఒత్తిడితో ఇజ్రాయిల్ విరుగుడును అందజేసింది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. హమాష్ అగ్ర నాయకులకు కొందరు ఆ దృశ్యాలను లైవ్ లో చూస్తూ థాంక్స్ గివింగ్ ప్రార్థనలు నిర్వహించారు. అలా ప్రార్థనలు చేస్తున్న వీడియోలో ఉన్న వారంతా ఇప్పుడు ఇజ్రాయిల్ హిట్ లిస్టులో చేరిపోయారు. వీరిలో ఇస్మాయిల్ హనీయే, మహమ్మద్ ఆల్ డైప్ ను ఇజ్రాయిల్ ఇటీవల తుదముట్టించింది. 

చిక్కుల్లో పడిన మొస్సాద్ ఏజెంట్లు..

ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ కు ఎక్కడ శత్రువులు ఉన్న వారిని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న మొస్సాద్.. ఆయా ఆపరేషన్లు నిర్వహించే సమయంలో ఇబ్బందులను ఏజెంట్లు ఎదుర్కొన్నారు. ఇరాన్ 20 మంది దాకా మొస్సాద్ ఏజెంట్లను నిర్బంధించినట్టు గత ఏడాది వార్తలు వచ్చాయి. తుర్కియేలోను 33 మంది ఏజెంట్లు చిక్కారు. గాజాలో సైనిక విభాగం - పొలిటికల్ బ్యూరో మధ్య ఫాతిమా హమాద్ సంధానకర్తగా ఉన్నారు. గాజాపై ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆమె తుర్కీయాలో తలదాచుకుంటున్నారు. ఫాతిమాను తుదముట్టించేందుకు 50 మంది దాకా మొస్సాద్ ఏజెంట్లు తుర్కీయాలో వేట ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ 33 మంది ఏజెంట్లను అరెస్టు చేసినట్లు తుర్కీయా గత ఏడాది డిసెంబర్లో ప్రకటించింది. గూడచర్యం నేరం కింద వీరికి ఉరిశిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్