పోస్టాఫీస్ లో స్కీమును నిలిపేసిన ప్రభుత్వం.. ఎందుకో తెలుసా.!

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పోస్ట్ ఆఫీస్ ద్వారా కొన్ని కీలక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ముఖ్యంగా ప్రజల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వివిధ స్కీముల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ షేవింగ్ సర్టిఫికెట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి కీలకమైన పథకాలు పోస్ట్ ఆఫీస్ లో అమలు చేస్తున్నారు. వీటికి ప్రజలు నుంచి కూడా ఆశించిన స్థాయిలోనే స్పందన లభిస్తోంది. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసుల్లో అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ పథకంలో భాగంగా అమ్మాయి పుట్టిన వెంటనే ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా అమ్మాయి పెళ్లి వయసు వచ్చేసరికి భారీ మొత్తంలో తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పోస్ట్ ఆఫీస్ ద్వారా కొన్ని కీలక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ముఖ్యంగా ప్రజల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వివిధ స్కీముల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ షేవింగ్ సర్టిఫికెట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి కీలకమైన పథకాలు పోస్ట్ ఆఫీస్ లో అమలు చేస్తున్నారు. వీటికి ప్రజలు నుంచి కూడా ఆశించిన స్థాయిలోనే స్పందన లభిస్తోంది. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసుల్లో అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ పథకంలో భాగంగా అమ్మాయి పుట్టిన వెంటనే ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా అమ్మాయి పెళ్లి వయసు వచ్చేసరికి భారీ మొత్తంలో తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. దేశంలోని మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ స్కీమును ప్రారంభించారు. ఇటువంటి అనేక స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్ లో అమలు చేస్తున్నారు. అయితే గత కొన్నారుగా అమలు చేస్తున్న ఒక కీలకమైన స్కీమును తాజాగా పోస్ట్ ఆఫీస్ లో నిలిపివేశారు. అదే మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం. ఈ పథకాన్ని 2025 మార్చి 31 నుంచి నిలిపివేస్తూ ఆదేశాలు వచ్చాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఎంఎస్ఎస్సి ఈ పథకం గడువు తర్వాత కొనసాగదని అధికారికంగా వెల్లడించింది. దీనివలన ఈ పథకంలో భాగంగా కొత్త డిపాజిట్లు చేసేందుకు లేదా పెట్టుబడులు పెట్టేందుకు ఆస్కారం లేకుండా పోతోంది. మహిళల ఆర్థిక భద్రతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2023 బడ్జెట్ సమయంలో ఈ ఎంఎస్ఎస్సి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలు పొదుపు చేసేందుకు ప్రోత్సాహం లభించింది. ఈ పథకాన్ని గత నెల ఆఖరి నుంచి నిలిపివేయడం వల్ల కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకున్న మహిళలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది.

మార్చి 31 2025 లోపు ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం 7.5% వడ్డీ రేటు తో ప్రయోజనం లభించనుంది. తాజాగా ఈ పథకంలో పెట్టుబడులను పెట్టకుండా నిలిపివేయడానికి గల కారణాలను ప్రభుత్వం తెలియజేయలేదు. భవిష్యత్తులో దీనిని పునరుద్ధరించే అంశం పైన కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకం ఇప్పటివరకు అమలు చేస్తూ తాజాగా నిలిపివేశారు. ఈ పథకాన్ని మిస్ అయిన వాళ్ళు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ షేవింగ్ సర్టిఫికెట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా నిలిపివేసిన దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా ఆశించిన స్థాయిలోనే రాబడి వస్తుందని పేర్కొంటున్నారు. ఎప్పటికే సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో పెద్ద ఎత్తిన డిపాజిట్లు చేస్తున్నారు. వీటి ద్వారా భారీగా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో పెట్టుబడి పెట్టాలని భావించి అందులో పెట్టేందుకు అవకాశం లేకుండా పోయినవారు ప్రత్యామ్నాయంగా ఉన్న ఈ పథకాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. దీనివల్ల మెరుగైన అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంటుందని భవిష్యత్తులో ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందడానికి ఇందులో పెట్టుబడులు అవకాశాన్ని కల్పిస్తాయని పనులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్