ఏపీలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. కొద్దిరోజుల్లోనే మత్స్యకారులకు ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సముద్రంలో చేపల వేటను నిషేధించిన రోజుల్లో మత్స్యకారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో చేపలు వేట నిషేధి సమయంలో మత్స్యకారులకు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు చేపల వేట సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి రూ.20 వేల జీవనభృతిని అందించాలని నిర్ణయించింది.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. కొద్దిరోజుల్లోనే మత్స్యకారులకు ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సముద్రంలో చేపల వేటను నిషేధించిన రోజుల్లో మత్స్యకారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో చేపలు వేట నిషేధి సమయంలో మత్స్యకారులకు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు చేపల వేట సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి రూ.20 వేల జీవనభృతిని అందించాలని నిర్ణయించింది. అదే విషయాన్ని తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇందుకోసం చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక సంబంధించిన విధి విధానాలను కొద్ది రోజుల్లోనే తయారు చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ నుంచి మత్స్యకారులకు ఈ జీవనభృతిని అందించనున్నారు. తాజా నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రెండు నుంచి మూడు నెలలపాటు తాము ఎదుర్కొనే ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
అన్నదాత సుఖీభవ కూడా
గడిచిన ఎన్నికల్లో రైతులకు 20 వేల రూపాయలు చొప్పున సాయాన్ని అందిస్తామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు అయింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు. వీటిలో రైతులకు అందిస్తామని చెప్పిన అన్నదాత సుఖీభవ పథకం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మే, జూన్ నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతుకు 20వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 15000 అందించేవారు. కూటమి ప్రభుత్వం ఈ సాయాన్ని ఐదువేల రూపాయలు పెంచి రూ.20 వేలు చొప్పున అందించేందుకు సిద్ధమవుతోంది.