తెలంగాణలోని వివిధ ప్రభుత్వ సంక్షేమాల లబ్దికోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించింది. వీటి కోసం ఏటా ప్రభుత్వంపై రూ.45 వేల కోట్ల అదనపు వారం పడుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు సోమవారం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ సంక్షేమాల లబ్దికోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించింది. వీటి కోసం ఏటా ప్రభుత్వంపై రూ.45 వేల కోట్ల అదనపు వారం పడుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు సోమవారం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే నాలుగు కొత్త పథకాలను ప్రారంభించే అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఏటా రూ.45 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని పేదలను, రైతు కూలీలను పట్టించుకోలేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు సోమవారం నుంచి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నట్లు పేర్కొన్నారు. టిఆర్ఎస్ హయాంలో రైతులకు కేవలం లక్ష రుణాలు మాఫీ చేయలేక చేతులెత్తేశారు అని, తాము ఏడాదిలోపే రైతులకు లక్షలోపు రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించారు. రెండు లక్షల వరకు రుణాలు ఉన్నవారికి మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12000 అందించునుంది తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మొత్తాలను జనవరి 26 అర్ధరాత్రి నుంచే ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రైతులు, రైతు కూలీలు సోమవారం నుంచి నగదు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర ఖజానాలో నగదు లేకపోయినా ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అర్హులైన అందరికీ పథకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆయా పథకాలకు సంబంధించిన మొత్తాల జమ కావడంతోపాటు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం సోమవారం నుంచి కల్పిస్తుండటం పట్ల లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.