రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పాలనా పాలనమైన నిర్ణయాలను తీసుకోవడంపైనే దృష్టి సారించింది. అందులో భాగంగానే జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు మంత్రులను ఇన్చార్జిగా నియమించింది. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్చార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పాలనా పాలనమైన నిర్ణయాలను తీసుకోవడంపైనే దృష్టి సారించింది. అందులో భాగంగానే జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు మంత్రులను ఇన్చార్జిగా నియమించింది. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్చార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇన్చార్జి మంత్రులు
ఏపీ ప్రభుత్వం జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పాలనా పాలనమైన నిర్ణయాలను తీసుకోవడంపైనే దృష్టి సారించింది. అందులో భాగంగానే జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు మంత్రులను ఇన్చార్జిగా నియమించింది. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్చార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాల ఇన్ఛార్జి మంత్రిగా అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వంగలపూడి అనిత, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా డోలా బాలవీరాంజనేయ స్వామి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొల్లు రవీంద్ర, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొంగూరు నారాయణ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నాదెండ్ల మనోహర్, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా గొట్టిపాటి రవికుమార్, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సత్యకుమార్ యాదవ్, కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వాసంశెట్టి సుభాష్, గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కందుల దుర్గేష్, బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొలుసు పార్థసారథి, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఎన్ఎండీ ఫరూఖ్, నంద్యాల జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పయ్యావుల కేశవ్, అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా టీజీ భరత్, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా అనగాని సత్యప్రసాద్, కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఎస్ సవిత, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బీసీ జనార్థన్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.