ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్లకు సంబంధించి మరో ముఖ్యమైన చర్యకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి కొద్దిరోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు అనర్హులైన పెన్షన్ల లబ్ధిదారులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్లకు సంబంధించి మరో ముఖ్యమైన చర్యకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి కొద్దిరోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు అనర్హులైన పెన్షన్ల లబ్ధిదారులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారన్నది కూటమి ప్రభుత్వ అభియోగం. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేకచోట్ల పెన్షన్లు తొలగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన పెన్షన్ల లబ్ధిదారుల వివరాలను పునః పరిశీలించడం ద్వారా అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో పెన్షన్ లబ్ధిదారుల అర్హత, అనర్హతకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనుంది. ఈ బాధ్యతను సంబంధిత సచివాలయాలకు, మండలాలకు సంబంధంలేని ఉద్యోగులను ఈ వెరిఫికేషన్ కోసం కేటాయించనున్నారు. సదరు ఉద్యోగులు ఒక్కో ఇంటికి వెళ్లి లబ్ధిదారుల వివరాలను పరిశీలించనున్నారు. ఇద్దరేసి ఉద్యోగులతో కూడిన ఒక్కో బృందం 40 మంది లబ్ధిదారులు చొప్పున వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆయా సచివాలయం పరిధిలో ఉండే మొత్తం పింఛన్దారుల సంఖ్య ఆధారంగా ఒక్కో సచివాలయ పరిధిలో ఏడు నుంచి 13 బంధాలను ఆయా జిల్లాల డిఆర్డిఏ పీడీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు గ్రామీణ ప్రాథమిక నిర్మూలన సంస్థ అధికారులు వివరాలను వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల ఏరివేతకు సిద్ధమైన వీటిపై ప్రణాళికయుతంగా ముందుకు వెళుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనర్హులకు పెన్షన్లు ఇచ్చారంటూ తమ పార్టీకి చెందిన నేతలతో ఫిర్యాదులు చేయించి వారిపై విచారణ జరిగేలా చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా పెన్షన్లు తీసుకుంటున్న వారు కూడా రద్దు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనర్హులవి మాత్రమే తొలగిస్తామని, అర్హులకు అన్యాయం జరగదని చెబుతోంది. నిబంధనకు అనుగుణంగా పెన్షన్లు మంజూరు అయ్యాయా లేదా అన్న అంశాలను మాత్రమే పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల పెన్షన్లను తొలగించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని, ఆ తర్వాత కొత్త పెన్షన్లు మంజూరు చేస్తుందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ ప్రక్రియ ఎప్పటిలోగా ప్రారంభమై ఎప్పటికి పూర్తవుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.