చిట్టా మొత్తం విప్పుతా.. ఇప్పటి వరకు ఇంటర్వెల్‌ మాత్రమే.. రేవంత్‌ రెడ్డి ఫైర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భారతీయ రాష్ట్ర సమితి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కేసీఆర్‌తోపాటు ఇతర నాయకులను ఉద్ధేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు చేసిన అవినీతి, దుర్వినియోగాలపై అసెంబ్లీలో స్పష్టమైన వివరాలు వెల్లడించామని, ఇంకా నిజాలన్నీ బయట పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు చెప్పింది కేవలం ఇంటర్వెల్‌ మాత్రమేనన్న ఆయన.. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా చిట్టా మొత్తం విప్పుతానని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు 57,946 ప్రభుత్వ ఉద్యోగాలను అందించామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Telangana CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భారతీయ రాష్ట్ర సమితి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కేసీఆర్‌తోపాటు ఇతర నాయకులను ఉద్ధేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు చేసిన అవినీతి, దుర్వినియోగాలపై అసెంబ్లీలో స్పష్టమైన వివరాలు వెల్లడించామని, ఇంకా నిజాలన్నీ బయట పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు చెప్పింది కేవలం ఇంటర్వెల్‌ మాత్రమేనన్న ఆయన.. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా చిట్టా మొత్తం విప్పుతానని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు 57,946 ప్రభుత్వ ఉద్యోగాలను అందించామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ అభివృద్ధే ఆయన లక్షయమని పేర్కొన్నారు. ఈ ప్రాంతం గొప్ప చైతన్యంతో కూడినదని, తెలంగాణ ఉద్యమంలో జిల్లా వాసులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారన్నారు. వరంగల్‌ అభివృద్ధికి రూ.6500 కోట్లు నిధులను కేటాయించినట్టు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా వరంగల్‌ను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిన సీఎం, రాష్ట్రంపై భారీగా పెరిగిన అప్పులను ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రస్తావించారు. రూ.8.29 లక్షల కోట్ల బకాయిలను బీజేపీ-బీఆర్‌ఎస్‌ పాలన నుంచి వారసత్వంగా అందుకున్నామన్నారు. ఈ మొత్తంలో కేవలం రూ.1.53 లక్షల కోట్లు మాత్రమే చెల్లించారని వివరించారు. సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 1.50 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారని, రూ.50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందించామన్నారు. రైతులకు రుణమాఫీ కింద రూ.20,610 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. పదేళ్లలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని ఆరోపించారు. హరీష్‌రావుతో వాగ్వాదంలో, కాంగ్రెస్‌ సాగునీటి ప్రాజెక్టులపై సవాల్‌ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదన్న హరీష్‌రావుకు సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ లక్ష కోట్లు పెట్టి కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయిందని, అది కాలేశ్వరం కాదు కూలేశ్వరి అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని, ఏపీ కృష్ణా జిల్లా జలాలను తరలించుకుపోతుంటే పట్టించుకోలేదని విమర్శించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు రూ.58 లక్షల జీతం, పోలీసుల పహారా ఎందుకని సీఎం ప్రశ్నించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్