దేశంలో నిరుద్యోగం గణనీయంగా పెరిగిపోతుంది. ఏటా లక్షలాది మంది డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. అయితే వారికి ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో నిరుద్యోగం గణనీయంగా పెరిగిపోతుంది. ఏటా లక్షలాది మంది డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. అయితే వారికి ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, లోన్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గడిచిన ఏడాది ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దేశంలోని టాప్ కంపెనీలో యువతుకు ఉద్యోగాలు అవకాశాలను ఈ ప్రోగ్రామ్ లో భాగంగా కల్పిస్తోంది.
తాజాగా మరోసారి యువత నుంచి ఇంటర్న్ షిప్ స్కీమ్ కోసం దరఖాస్తులను కోరుతోంది. ప్రధానమంత్రి ఇంటర్న్ స్కీమ్ ద్వారా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన వారు pminternship.mca.gov.in లో అప్లై చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్లి అభ్యర్థులు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత వివిధ సెక్టార్లలో తమకు అనువైన ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 12 నెలలు పెయిడ్ ఇంటర్న్ షిప్ కల్పిస్తారు. ఇంటర్న్ షిప్ చేస్తూనే ఆ సమయంలో ఐదు వేల చొప్పున స్టైఫండ్ అందించనున్నారు. ఇంటర్న్ షిప్ పూర్తయిన తర్వాత ఒక్కసారి రూ.6000 చెల్లిస్తారు. ప్రధానమంత్రి ఇంటర్న్ స్కీమ్ కు అప్లై చేసుకోవడానికి మార్చి 12 వరకు గడువు విధించారు. ఈ స్కీమ్ కు ఎవరు అర్హులు అంటే.. అభ్యర్థుల వయసు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ పూర్తి చేసిన వారికి అవకాశం ఉంటుంది. అలాగే బిఎ, బీఎస్సీ, బీకాం, బిసిఎ, బిబిఏ, బీఫార్మసీ వంటి డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ప్రతి శిక్షణ జ్యోతి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీ లభిస్తుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రతినెల 5000 రూపాయలు స్టేఫండ్ పొందవచ్చు.