నేడు పూర్తిగా బలహీన పడనున్న వాయుగుండం.. వర్షాలతో రైతాంగానికి నష్టం

కోస్తాంధ్రను వణికించిన వాయుగుండం దిశ మార్చుకుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం నుంచి గంటకు ఎనిమిది కిలో మీటర్ల వేగంతో తూర్పు ఈశాన్యంగా పయనిస్తోంది. ఇది శనివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఆదివారం సాయంత్రానికి పూర్తిగా సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Crop flooded by rains

వర్షాలతో నీట మునిగిన పంట

కోస్తాంధ్రను వణికించిన వాయుగుండం దిశ మార్చుకుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం నుంచి గంటకు ఎనిమిది కిలో మీటర్ల వేగంతో తూర్పు ఈశాన్యంగా పయనిస్తోంది. ఇది శనివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఆదివారం సాయంత్రానికి పూర్తిగా సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం ఆదివారం ఉదయం వరకు ఉత్తరాంధ్ర ఒడిశా తీర ప్రాంతాలపై ఉండనుంది. ఉత్తర భారత దేశంలో పడమర నుంచి తూర్పు దిశగా భూ ఉపరితలానికి 12.5 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంగా వీస్తున్న జట్టు స్ట్రీమ్ గాలులు ఇంకా ఉత్తరాదిలో కొనసాగుతున్న వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావంతో వాయుగుండం దిశ మార్చుకుందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. వాయుగుండం ఆదివారం ఉదయం నుంచి పూర్తిగా బలహీన పడనుంది. ఆదివారం వరకు మత్స్యకారుల చేపల వేటకు వెళ్ళరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఆదివారం కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం శనివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

పినపెంకిలో 88.5, ఇచ్చాపురంలో 87.5, ఇద్దనవలసలో 84.75, బోండపల్లిలో 80.5, రాజపురంలో 80.5, బాతు పురంలో 79.25, జరజాపుపేట, గంభీరం, కాపులుప్పాడలో 77.5, గుర్ల, తెర్లాంలో 74.5, విశాఖపట్నం రూరల్ లోని సర్వీస్ రిజర్వాయర్ వద్ద 73 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. ఈ వర్షాలకు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతిపురం, మన్యం జిల్లాల్లో వరి పనలు, కుప్పలు నీట మునిగాయి. కోతకు సిద్దంగా ఉన్న చేలు నేలకొరిగాయి. కల్లాల్లో దాన్యం తడిసిపోయాయి. దీంతో వేలాది మంది రైతులు నష్టపోయారు. బంగాళాఖాతంలో మంగళవారం నుంచి తూర్పు గోదావరిలో బలంగా మారనున్నాయి. రెండు రోజులపాటు సముద్రం నుంచి తేమ గాలులు తమిళనాడు దానికి ఆనుకొని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల వైపుగా వీయనున్నాయి. ఈ ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాలు తర్వాత పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలని ఆదేశించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్