వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటన నిందితుడికి శిక్ష ఖరారు.. జీవిత ఖైదు విధించిన కోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటన కేసుకు సంబంధించి స్థానిక సీల్దా కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సంజయ్ రాయ్ ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. జీవితాంతం అతడు జైల్లోనే ఉండాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. మరణించేంతవరకు జైల్లోనే ఉంచాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జైలు శిక్షతోపాటు రూ.50 వేల రూపాయల జరిమానాన్ని కూడా కట్టాలని స్పష్టం చేసింది కోర్టు.

Convict Sanjay Roy

దోషి సంజయ్ రాయ్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటన కేసుకు సంబంధించి స్థానిక సీల్దా కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సంజయ్ రాయ్ ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. జీవితాంతం అతడు జైల్లోనే ఉండాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. మరణించేంతవరకు జైల్లోనే ఉంచాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జైలు శిక్షతోపాటు రూ.50 వేల రూపాయల జరిమానాన్ని కూడా కట్టాలని స్పష్టం చేసింది కోర్టు. గడిచిన ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జి కర్ ఆసుపత్రిలో విధులకు హాజరైన వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. అనంతరం వైద్య విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను తొలత స్థానిక పోలీసులు చేపట్టగా.. హైకోర్టు జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అనంతరం సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో జోక్యం చేసుకోవడంతో విచారణను సిబిఐకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడిగా భావించిన సంజయ్ రాయ్ పై భారత న్యాయ సంహిత చట్టంలోనే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసును సిబిఐ చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా 120 మందికిపైగా సాక్షులను సిబిఐ విచారించింది. అనేక సాక్షాలను, ఆధారాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్లు 64, 66, 103(1) కింద సంజయ్ కు జీవిత ఖైదు విధిస్తూ  తీర్పును వెలువరించింది. ఇక బాధ్యత కుటుంబానికి 17 లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సీల్దా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఘటన దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. బాధిత వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైద్యులు నిరసనలు చేపట్టారు. దీక్షలు కొనసాగించారు. కలకత్తాలో వైద్య విద్యార్థులకి సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీలో అప్పట్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొని తన సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ కొందరు ఈ కేసు వ్యవహారాలు బయటకు రాకుండా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వైద్యులు ఆసుపత్రి ప్రాంగణంలో చేస్తున్న నిరసనపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇది కూడా అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసులో అనేక మందిపై తొలత అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. సిబిఐ విచారణ అనంతరం సంజయ్ రాయ్ నిందితుడుగా పేర్కొనడంతో పాటు తాజాగా కోర్టు కూడా దోషిగా తేల్చడంతో ఈ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చినట్టు అయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్