తెలంగాణలో టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడు నుంచి అంటే.!

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టిజి టెట్ - 2025 షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దేనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 15 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. టెట్ అర్హతలకు సంబంధించి పేపర్ 1 కు డీఎడ్, పేపర్ 2 కు సంబంధించి బిఎడ్ పూర్తి చేసి ఉండాలి. వీరు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరితోపాటు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్లకు సైతం టెట్ అర్హతను ప్రామాణికంగా నిర్ణయించడంతో వేలాది మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 9సార్లు పరీక్షలు నిర్వహించగా జనవరిలో పదోసారి నిర్వహించనున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష  టిజి టెట్ - 2025 షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దేనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 15 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. టెట్ అర్హతలకు సంబంధించి పేపర్ 1 కు డీఎడ్, పేపర్ 2 కు సంబంధించి బిఎడ్ పూర్తి చేసి ఉండాలి. వీరు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరితోపాటు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్లకు సైతం టెట్ అర్హతను ప్రామాణికంగా నిర్ణయించడంతో వేలాది మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 9సార్లు పరీక్షలు నిర్వహించగా జనవరిలో పదోసారి నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిలోపే రెండోసారి నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు టెట్ పేపర్ వన్ ఉత్తీర్ణులు కావాలి. డిగ్రీ తర్వాత బీఈడీ పూర్తి చేసిన వారు టెట్ పేపర్ 2 లో ఉత్తీర్ణత సాధించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం సెక్షన్ 23 (1) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేయాలంటే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) లో అర్హత పొందడం తప్పనిసరి. ఇప్పటివరకు డిఎడ్, బి.ఎడ్ తదితరు కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు. కానీ ఎన్సీటిఈ తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ను ఇకనుంచి ఏటా రెండుసార్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డేటా జూన్, డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించేలా ప్రభుత్వం స్పెషల్ షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. గతంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సిటిఈ) డేటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

టెట్ కు హాజరవ్వాలంటే అర్హతలు ఇవే..

టెట్ పరీక్ష పేపర్ - 1 కు హాజరు కావాలంటే డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45% మార్పులు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు 2015 లోపు డీఈడి చేసి ఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్పులు ఉంటే సరిపోతుంది. టెట్ పేపర్ 2 డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు బిఈడి అయితే జనరల్ కు 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్పులు ఉన్న అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు. పరీక్షా విధానంపై కూడా స్పష్టత ఇచ్చింది. టెట్ పరీక్షలకు సంబంధించి 15 మార్కులకు పేపర్ 1, 150 మార్కులకు పేపర్ 2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1 లో ఐదు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 30 మార్కులు కేటాయించారు. పేపర్ 1 లో నాలుగు విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్పు చొప్పున 30 మార్కులు కేటాయించారు. నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 60 మార్కులను కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను ఓసీలకు 90 గా, బీసీలకు 75 గా, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అరవిగా ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్