మూడు రోజులు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

రంజాన్ సందర్భంగా షబ్-ఎ-ఖదర్, జుమాతుల్-విదా, ఈద్-ఉల్-ఫితర్‌కు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈద్ రోజున ఇప్పటికే సెలవులు ప్రకటించినప్పటికీ, నెలవంక దర్శనాన్ని బట్టి తేదీలు మారవచ్చు.

eid ul fitr

ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, హైదరాబాద్: రంజాన్ సందర్భంగా షబ్-ఎ-ఖదర్, జుమాతుల్-విదా, ఈద్-ఉల్-ఫితర్‌కు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈద్ రోజున ఇప్పటికే సెలవులు ప్రకటించినప్పటికీ, నెలవంక దర్శనాన్ని బట్టి తేదీలు మారవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ ప్రకారం, షబ్-ఎ-ఖదర్, జుమాతుల్-విదా సెలవులు మార్చి 28 శుక్రవారం, మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలను ఈద్-ఉల్-ఫితర్ సెలవులుగా ప్రకటించారు. ఈ తేదీలు నెలవంక దర్శనాన్ని బట్టి ఉంటాయి. షబ్-ఎ-ఖదర్ సెలవులను ఐచ్ఛికంగా ప్రకటించినప్పటికీ, ఈద్ సెలవులను సాధారణ సెలవుగా ప్రకటించారు. ఇక.. ఈద్-ఉల్-ఫితర్ వేడుక నెలవంక దర్శనం మీద ఆధారపడి ఉంటుంది. మార్చి 30న నెలవంక కనిపిస్తే, మార్చి 31న ఈద్ జరుపుకుంటారు. లేకుంటే, ఏప్రిల్ 1న జరుపుకుంటారు. అదేవిధంగా, ఈద్-ఉల్-ఫితర్ సెలవులు కూడా మారుతాయి. తెలంగాణలో షబ్-ఎ-ఖదర్ సెలవుల్లో ఎటువంటి మార్పు ఉండదు. హైదరాబాద్‌లోని వివిధ దుకాణాలలో అమ్మకాల జోరు కొనసాగుతూ ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్