తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ రోజు ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
టెట్ 2024 ఫలితాలను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఈవార్తలు: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ రోజు ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సారి టెట్లో అర్హత సాధించిన వారికి రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. టెట్ 2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. అంతేకాదు.. టెట్లో అర్హత సాధించలేకపోయిన దరఖాస్తుదారులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.