తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు 31,382 మంది క్వాలిఫై

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

tspsc results

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 31,382 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఫలితాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. కాగా, గ్రూప్-1 మెయిన్స్ కోసం అభ్యర్థులను 1:100గా ఎంపిక చేయాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. టీజీపీఎస్సీ కార్యాలయన్ని ముట్టడించి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే, 1:100గా అభ్యర్థులను ఎంపిక చేస్తే.. కొంతమంది కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుందని, దాంతో పరీక్ష మళ్లీ వాయిదా పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్