తెలంగాణ అసెంబ్లీకి తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్

ప్రభుత్వం మారిన తర్వాత అసెంబ్లీకి హాజరుకాని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి సభకు హాజరుకాబోతున్నారు.

kcr assembly

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఈవార్తలు : ప్రభుత్వం మారిన తర్వాత అసెంబ్లీకి హాజరుకాని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి సభకు హాజరుకాబోతున్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తుంటి ఎముక విరిగి దవాఖానలో చేరిన ఆయన.. ఆ సమయంలో సభకు హాజరుకాలేదు. అయితే, నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఆయన హాజరు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్