రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అర్హులందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.

ration cards telangana

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అర్హులందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న జిల్లా కేంద్రాలు మినహా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారు.

ప్రస్తుతం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ జిల్లాల్లో తప్ప మిగతా చోట్ల రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగించాలని తెలిపారు. అదేవిధంగా, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్