నూతన సంవత్సరం-2025 క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించనున్నట్లు జగిత్యాల జిల్లా మల్యాల మండల పద్మశాలి సంఘం నిర్వాహకులు తెలిపారు.
మల్యాల, ఈవార్తలు : నూతన సంవత్సరం-2025 క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించనున్నట్లు జగిత్యాల జిల్లా మల్యాల మండల పద్మశాలి సంఘం నిర్వాహకులు తెలిపారు. మల్యాల పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్(రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదురుగా)లో ఉదయం 11 గంటలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుందని వెల్లడించారు. మల్యాల పట్ణణ, మండలంలోని ప్రతి గ్రామం నుంచి కులబాంధవులు ఈ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు ముల్క మల్లయ్య, కార్యవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు.